Sunday, May 9, 2021

జీవన దిక్సూచి

హర హర శంకర శ్రీకర సన్నుతి  మనిషికి  జీవన  దిక్సూచి 

హర  హర  లయకార  ఢమరుక  రావాకృతి  మరోమారు  జన్మకు  దిక్సూచి 


మట్టిలోనే  మట్టిరా  దేహమన్నది 

వీర్యపు  కణమై  కడుపునా  పడుతూ  

నెల  నెల  ఎదిగిన  ఓ  శిశువా.. 

తనువే  తొడిగి  భువిలో  పడుతూ 

తెలియని  పుట్టుక  నీది  కదా 


పూర్వ  జన్మాల  స్మృతిని  మరిచిపోయావు  మానవా 

మాయ  నిన్నవరించి  నడక  నేర్చావు  మెల్లగా ..

పసలేని  అజ్ఞాన  విద్యలే  నేర్చి  గర్వపడతావురా .

ఈ  రక్త మాంసాల  దేహమే  చూసి  మురిసిపోతావురా .


వెనువెంట  వస్తున్నా  మృత్యు  పాశాంన్ని  మరిచిపోబోకురా ..

సాగితే  నీ  సరిలేరుఅని  డాంబికం తెగ  పలకకురా..


పీనుగై  మారిన  క్షణమున  కుక్కతో  సమమవ్వురా ..

ధనమే  సుఖమును  భ్రమలో  పడుతూ .

కనులే  కానక  తిరిగేదవా .

తలకు  మోముకు  రంగులు  వేస్తూ ..

కాలం  కన్నులు  మోసెదవా  ..


పోగు చేసిన  లక్షలు  కోట్లు  నిన్ను  బ్రతికించవురా ..

నువ్వు  పొందిన  ఎన్నో  బిరుదులూ  చావు  తప్పించవురా ..

భార్యా  బిడ్డలు  వెంట  వత్తురని  కలలో  కూడా  తలచకురా ..

వదలక  నీతో  వచ్చినా  ఆ  వల్లకాటి  వరకేరా ..


నిన్ను  మోసిన  పల్లకి  చివరికి  నీ  పాడే  అవుతది  ..

నువ్వు  ఉండిన  గృహమే  చివరకు  నిను వెళ్ళమంటది .

నిను  కాల్చివేయు  కట్టెలుగా 

ఓ  చెట్టుకు  రాసి  ఉంటుంది ..


పరిమళాలు  పులుముకున్న  తనువు 

ఈ  మన్ను  కలవక  తప్పదది ..

పోయే  ముందర  కాలం  పక పక పరిహాసమాడుట  తధ్యమది ..


శవమై తిరిగే  తెరలో  శివమా .

నువ్వు ఎరగని  కదా  నీది  కదా .


నెత్తుటి  మాంసపు  ముద్దగా  ఎదిగిన .

కాయం  కూలుట  ఖాయమురా ..


కాబోయే  శవం  నీవు  కదరా  దేహం  పై  మొహం  వదలరా ..

ఇన్నాళ్లు  సాధించింది  ఏది  రా  , నీకోసం  ఏం  చేసావురా !!!

అన్నమయ్య కీర్తన

 ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||


చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | 
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||

చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | 
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||

చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | 
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై | నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||



To listen this as a song, we got wonderful creative tune from Yekam movie and can be visited from the below LInk.

https://www.youtube.com/watch?v=SYiDTN5-lok

Tuesday, February 9, 2021

 నీతి కథ - మాతృభక్తి


బ్రహ్మకు కదృవ, వినుత అను ఇరువురు భార్యలు కలరు. ఒకనాడు కశ్యపుడు సంతోషంతో ఉన్న సమయాన కుదృవ పతిపాదముల చెంగట కూర్చుండి "నాకు వేయిమంది కొడుకులను దయసేయుము " అని కోరెను. వినతయు భర్తను ఆనందపెట్టి "నాకు కడింది వీరులు అగు ఇరువురు కుమారులను అనుగ్రహింపుము " అని ప్రార్థించెను. కశ్యపుడు అందులకు అంగీకరించి వారి కోరికలు తీర్చెను. 

పిమ్మట కద్రువ కు వేయి గుడ్లను, వినుటకు రెండు గుడ్లను పుట్టెను. ఆ సవతులు ఇరువురు ఆ గుడ్లను నేతికుండలయందుంచి అతి భద్రముగా సాకుచుండిరి. అట్లు అయిదువందల సంవత్సరములు గడచిన తర్వాత కద్రువకు వేయి గుడ్లనుండి శేషుడు, వాసుకి, కర్కోటకుడు  మున్నగు వేయి పాములు పుట్టెను. సవతి కి వేయి గుడ్లు పొదిగి తన గుడ్లు అలాగే ఉండటం చూసి వినుత తాళజాలక ఒక గుడ్డు చిడిపెను. వెంటనే కాళ్ళులేని ఒక పురుషుడు దాని నుండి బయటకు వఛ్చి "నా శరీరము పూర్తి కాకముందే నన్ను బయటకు తీసితివి. ఇందులకు ప్రతిఫలంగా నీవు నీసవతికి అయిదువందల యేండ్లు దాసివై ఉండుము. రెండవ గుడ్డును దానికది పగులునంత దనుక యుండనిమ్ము. అందునుండి చాల బలముకలవాడు పుట్టును. అతడు నీ దాసీతానము పోగొట్టును" అని చెప్పి వెంటనే సూర్యునకు సారధిగా వెడలిపోయెను. 

తన తెలివితక్కువ తనముకు విచారించుచు వినత రెండవ గుడ్డును జాగ్రత్తగా కాపాడుకొనసాగేను. ఇది ఇలా ఉండగా ఒకరోజు సాయంకాల సమయమున సవతులిరువురు సముద్ర తీరమునకు వెడలిరి. అచ్చట సంచరించుచూ ఉండిరి. ఒద్దు మీద ఉరకలు వేయుచున్న సముద్రపు కెరటముల మీది నురుగువోలె తెల్లనైనున్న యా గుఱ్ఱమును చూసి కద్రువ ఇలా అన్నది. చెల్లెలా! ఒడలంతయు తెలుపు, తోకమాత్రము కాఱునలుపు. ఆ గుఱ్ఱము యెంత చక్కగా నున్నదో చూడుము అని చెప్పెను. అందులకు వినుత తోక కూడా తెల్లగా ఉండగా నల్లగా ఉన్నదందు వేల? అని మాఱు పలికెను. దాని మీద ఇద్దరికీ వాగ్వాదం జరిగి పందెమువేసుకొని తెల్లగా ఉండగా నేను నీకు దాసిని అగుదును లేనియెడల నీవు దాసివయ్యెదవ అని కద్రువ అడిగెను.వినుత అంగీకరించి రమ్ము దగ్గరకు వెళ్లి చూద్దాం అని వినుత అనగా కద్రువ ఇప్పుడు కాదు పొద్దుగూకుచున్నది. భర్త గారికి పరిచర్య చేయవలదా రేపు చూతము అని చెప్పెను. మంచిది అనుకోని పిదప ఇద్దరు ఇంటికి పోయిరి. 

రాత్రి కద్రువ కుమారులని చేరబిలిచి సంగతి అంతయు దెలిపి "మీరు పోయి దాని తోక నలుపు సేయరేని వినుతకు నేను దాసీనయ్యెదను అనియెను." అది అధర్మము అని ఆడవాండ్రకు మంచి చెడ్డలు తెలియవా అని అట్లు చేయుటకు సమ్మతింప లేదు. అపుడు కద్రువ కోపించి జనమేజయుడు సేయు సర్పయాగమున మీరందరును నాశనమయ్యెదరుగాక అని సెపియించెను. ఈ శాపమునకు భయపడి కర్కోటకుడు నీ ఆజ్ఞ ప్రకారము చేసెదనని తెలిపి తల్లికి విన్నవించుకొనెను. 

మరునాడు ప్రొద్దుననే సవతులిరువురు గుఱ్ఱమును పరీక్షించుటకు సముద్రపు గట్టునకు పోయిరి. అప్పటికప్పుడే కర్కోటకుడు పోయి గుఱ్ఱము తోకను అంటి వ్రేలాడుచుండెను. అల్లంత దూరమునే చూచి వినుత "అక్కా నీవన్నదే నిజము నేను నీదాసినైతిని రమ్ము " అని వెనుదిరిగి వఛ్చి సవతి కి దాస్యము చేయసాగెను. 

అయిదారువందల సంవత్సరముల గడచిన తరువాత వినత రెండవ గుడ్డు చితికి దాని నుండి గరుడుడు పుట్టెను. మంచిరోజులు వచ్చనని వినత ఆనందించెను. కద్రువ తన పిల్లలకు సేవ చేయుచుండుమని గరుడుని నియమించెను. తల్లియు, కొడుకును దాస్యము చేయుచుండిరి. 

ఇట్లు కొన్ని దినములు గడిచెను. ఒకనాడు గరుడుడు "కద్రువ నా సవతి తల్లి. ఆమెకు మేము దాసితనమేలా చేయవలెను ? తన తోడిదానికి-సవతి కి మాయమ్మ నౌకరి చేయుచున్నది. నా కన్నతల్లికి ఈ విపత్తు పోగొట్టలేని జన్మమేల? నేను బ్రతికియుండు ఏమి ప్రయోజనము?" అని యూరడిల్లి సవతితల్లి చెంతకుబోయి "ఏమి తెచ్చి ఇచ్చిన మమ్ము విడిచిపెట్టెదరు" అని అడిగెను. కద్రువ కొడుకులతో నాలోచించి "నీకు శక్తి కలదేని అమృతభాండము తెచ్చి ఇమ్ము" అనియెను. 

తోడనే తల్లిదండ్రుల అనుగ్రహంబున ఆకలి తీర్చుకొని గరుడుడు స్వర్గలోకమునకేగి అమృతభాండము రక్షించుచున్న వారినందరిని సంహరించి దాని చుట్టుయున్న అగ్నిని, సముద్ర జలమును పుక్కిటగొనివచ్చి ఆర్పివేసి లోపల కాపలాగా ఉన్న పాముల్ని జంపి భాండమునెత్తుకొని బయలుదేరెను. ఇంద్రుడు అతనితో బోరాలేక స్నేహముజేసి "నీ ప్రజ్ఞకు మెచ్చితిని. ఏమి కావలయునో కోరుకొనుము" అనియెను. అప్పుడు గరుడుడు నీ రాజ్యములోనున్న పాములను భక్షించుటకు నాకు అనుమతి కావలెననెను. ఇంద్రుడు అందులకు అంగీకరించి అమృతభాండమును నీవు కద్రువులయెదుట నుంచి దాస్యవిముక్తి నుంచి విడుదల అయినపిదప నేను అమృతభాండమును తీసుకొనిపోయెదననెను. గరుడుడు అంగీకరించి అమృతభాండమును కద్రువ యెదుటనుంచి మమ్ములను దాస్యవిముక్తినుంచి తప్పించినట్లేనా అనెను. మీరు అమృతభాండమును అక్కడ ఉంచి నిశ్చింతగా వెళ్ళండి అనెను. 

కద్రువ మరియు తన వేయుగూరు కుమారులు స్నానమాచరించి అమృతము సేవించదలిచిరి. ఇంతలో ఇంద్రుడు అమృతభాండమును తీసికొనిపోయెను. కద్రువ అక్కడ అమృతభాండము లేనిది చూసి బహుదుఃకించిరి. అమృతభాండమున్న ప్రదేశములో ఉన్న దర్భలను నాకిరి, అపుడు ఆ దర్భలు తెగి నాలుక రెండుగా చేయలేను. అందువల్ల పాములకు నాలుకలు రెండుగా మారెను. 

గరుడుడు ఇట్లు కష్టపడి తన తల్లిని దాస్యవిముక్తి రాలిని చేసి రక్షించి ధన్యుడు అయ్యెను. 

                                                                                                            మాతృదేవో భావ !!



జీవన దిక్సూచి

హర హర శంకర శ్రీకర సన్నుతి  మనిషికి  జీవన  దిక్సూచి  హర  హర  లయకార  ఢమరుక  రావాకృతి  మరోమారు  జన్మకు  దిక్సూచి  మట్టిలోనే  మట్టిరా  దేహమన్నది...