Sunday, November 11, 2018

ప్రహ్లాద చరిత్ర

ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే!


రాక్షసరాజయిన హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి అంటే ద్వేషంకాని అతడి కొడుకు ప్రహ్లాదుడికి మాత్రం విష్ణువంటే మహాభక్తి కావడం వల్ల ఎప్పుడూ శ్రీహరినే ధ్యానించేవాడుదాంతో కొడుకుపైన హిరణ్యకశిపుడికి కోపం వచ్చిందిఎన్ని విధాలుగా చెప్పినాప్రహ్లాదుడు విష్ణుభక్తిని మానుకోకపోవడంతో నిజంగానే శ్రీహరి అంతటా ఉన్నాడాఅని కొడుకును ప్రశ్నిస్తాడుఅప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానమే  పద్యం.
తాత్పర్యంవిష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడుఅక్కడ లేడు అనే సందేహం అక్కరలేదుఆయన అన్నిచోట్లా ఉంటాడుఎక్కడ వెతికితే అక్కడే కనపడతాడు రాక్షసరాజాఇది సత్యం.
 పద్యంలో, ‘ఇందుఅందుఎందెందుఅందందే’ అనే పదాలు వచ్చాయిఇవన్నీ ఒకేలాంటి పదాలు కావటం వల్ల వినడానికి చాలా హాయిగా ఉంటాయిఅంతేకాదు ఇలాంటివి నేర్చుకోవటం కూడా తేలిక.

చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్ నే
చదివినవి కలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!

పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని పద్యం ఇదిహిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని విద్యాభ్యాసం కోసం గురువులైన చండామార్కుల వారి దగ్గర చేర్చుతాడుకొంతకాలం గడిచాక,
కుమారుడు ఎంతవరకు చదువుకున్నాడో తెలుసుకుందామనే ఉద్దేశంతో
ఆశ్రమానికి వచ్చికొడుకును ప్రశ్నిస్తాడు ప్రశ్నకు జవాబుగా ప్రహ్లాదుడు చెప్పినదే  పద్యం...
భావంతండ్రీగురువులైన చండామార్కులవారు నన్ను బాగా చదివించారుధర్మానికిఅర్థానికి సంబంధించిన ముఖ్యశాస్త్రాలన్నీ చదివానుఅంతేకాదు ఇంకా చాలా విషయాలు కూడా చదివానుచదువులలో దాగి ఉన్న విషయాలన్నిటినీ తెలుసుకున్నాను.
 పద్యంలో ప్రహ్లాదుడు ‘చదువులలో మర్మమెల్ల’ అన్న మాటను... అన్ని విద్యలలోనూ దాగి ఉన్నది భగవంతుడైన విష్ణుమూర్తి మాత్రమే అనే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని పలుకుతాడుఇందులో ‘చదువు’ అనే పదం నాలుగు పాదాలలోనూ ఉందిఅందువల్ల నేర్చుకోవడానికి ఇబ్బంది లేకపోవడమేగాకవినడానికి కూడా ఇంపుగా ఉంటుంది.

చదువనివాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత కలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రీ!
రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునితో చదువు యొక్క విశిష్ఠత గురించి చెప్పిన సందర్భంలోనిది  పద్యంఇది పోతన భాగవతంలోని ప్రహ్లాదచరిత్రలోనిది.

భావంనాయనా ప్రహ్లాదాచదువుకోనివాడు అజ్ఞాని అవుతాడుబాగా చదువుకుంటే సత్అసత్ అంటే ఏది మంచిఏది చెడు అనే విషయాలు బాగా అర్థమవుతాయిఅందుకే అందరూ శ్రద్ధగా చదువుకోవాలిఅది కూడా గురువుల దగ్గరకు వెళ్లి మాత్రమేచదువుకోవాలికాబట్టి మన కులగురువులైన చండామార్కుల వారి దగ్గర నిన్ను చదివిస్తాను.

 పద్యంలో చదువుకోవడం ఎంత అవసరమో చెబుతూఅది గురువుల దగ్గర చదువుకోవాలనే విషయాన్ని తెలియచేశాడు పోతనరాక్షసరాజయినప్పటికీ హిరణ్యకశిపునికి గురువుల పట్ల గౌరవం ఎక్కువ పద్యంలో ‘చదువు’ అనే పదాన్ని వాడుతూ,పిల్లలంతా ఎందుకు చదువుకోవాలో చక్కగా వివరించాడు.

No comments:

Post a Comment

జీవన దిక్సూచి

హర హర శంకర శ్రీకర సన్నుతి  మనిషికి  జీవన  దిక్సూచి  హర  హర  లయకార  ఢమరుక  రావాకృతి  మరోమారు  జన్మకు  దిక్సూచి  మట్టిలోనే  మట్టిరా  దేహమన్నది...