![]() |
వేమన |
వేమన అందరికీ తేలికగా అర్థమయ్యే పదాలతో పద్యాలు రాసినవాడు వేమన. వేమనను ప్రజాకవి అంటారు. ఆయన సమాజంలో ఉండే మంచిమంచి విషయాలను గ్రహించి, వాటిని చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకునే విధంగా చిన్నచిన్న పదాలతో శతకం రాశాడు. ప్రతిపద్యానికి చివర వాక్యం (దీనిని మకుటం అంటారు) ‘విశ్వదాభిరామ వినురవేమ’ అని వస్తుంది.
వేమన్న ఆశుకవి. ఆయన పద్యాలు ఆయన నోటిలోంచి ఆయన అభిమానుల లేదా శిష్యుల చెవుల్లోకి, వారి హృదయాల్లోంచి తాటాకుల్లోకి ప్రవహించాయి.
అల్పజాతివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినురవేమ!
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ! వినురవేమ!
పద్య అర్థం: చెడ్డవాడికి అధికారం ఇస్తే మంచివారందరినీ (దొడ్డవారినెల్ల...) వె ళ్లగొడతాడు. చెప్పులను ఎంతో ఇష్టంగా తినే కుక్కకు, చెప్పు రుచి కంటె చెరుకు రుచి చాలా తియ్యగా ఉంటుంది కదా అని పెడితే, దానికి ఆ చెరుకులోని తియ్యదనం తెలియదు. దానినోటికి చెప్పుల రుచే తియ్యగా ఉంటుంది. అది దాని జాతి లక్షణం. అలాగే దుష్టుైడె న వాడికి చెడుమాటలే బాగా నచ్చుతాయి. చెడ్డవారినే ఇష్టపడతాడు. తను చేసే చెడుపనులకు చెడ్డవారు మాత్రమే సహాయం అందిస్తారు. అందుకే అల్పజాతివానికి (దుష్టుడైనవానికి) పాలన అధికారం ఇచ్చిన వెంటనే ముందుగా మంచివారిని (దొడ్డవారినెల్ల) ఆయా పనులలోంచి తీసివేస్తాడు. సమాజంలో ఉండే మనుషుల ప్రవర్తనను జంతువుల స్వభావంతో పోల్చి, చిన్నచిన్న పదాలతో ఉండే పద్యంలో చక్కగా వివరించాడు వేమన.
బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు
ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ
ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము
విశ్వదాభిరామ వినురవేమ
ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు అని చెప్తున్నాడీ పద్యంలో వేమన. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరిఎప్పుడు ఆగిపోతుందో తెలియదు.
భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలయాపన కదా! జ్ఞాన యోగం ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవేవీ శాశ్వతం కాదు. ధనమూ అంతే! అది స్వార్జితమేనా? అది నీ చేతిలో ఎంత కాలముంటుందంటావు. ధర్మమొక్కటే నువ్వు పోయినామిగిలి ఉండేది తెలుసుకొమ్మంటున్నాడు వేమన.
బొంది అంటే దేహం. దీనికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం. చివరికి మరణం అనే పరిణామముంది. కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ తాత్కాలికమే. బొందితో కైలాసం వెళ్తారంటారు. అంటే సశరీర ముక్తి. అది నీకు సాధ్యమయ్యే పనేనా? బొంది దేశీయ పదం. కన్నడంలో కూడా బొంది. తమిళంలో పొంది.
ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్లీ ఆత్మలోకే వెళ్లిపోతుంది. భక్తి సేయ అంటే భక్తిని చూపడం, ఆచరించడం. భక్తి అంటే అంకితభావం. ధనం కలకాలం ఉంటుందనుకోవడంలోనే నీ అజ్ఞానం ఇమిడి ఉంది. దానిని దానధర్మాలకు వెచ్చించడమేవివేకం.
ధర్మాన్ని గురించి గతంలో అనేకసార్లు ప్రస్తావించడం జరిగింది.
‘తనువు ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము’ అనేది పాఠాంతరం.
ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ
ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము
విశ్వదాభిరామ వినురవేమ
ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు అని చెప్తున్నాడీ పద్యంలో వేమన. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరిఎప్పుడు ఆగిపోతుందో తెలియదు.
భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలయాపన కదా! జ్ఞాన యోగం ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవేవీ శాశ్వతం కాదు. ధనమూ అంతే! అది స్వార్జితమేనా? అది నీ చేతిలో ఎంత కాలముంటుందంటావు. ధర్మమొక్కటే నువ్వు పోయినామిగిలి ఉండేది తెలుసుకొమ్మంటున్నాడు వేమన.
బొంది అంటే దేహం. దీనికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం. చివరికి మరణం అనే పరిణామముంది. కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ తాత్కాలికమే. బొందితో కైలాసం వెళ్తారంటారు. అంటే సశరీర ముక్తి. అది నీకు సాధ్యమయ్యే పనేనా? బొంది దేశీయ పదం. కన్నడంలో కూడా బొంది. తమిళంలో పొంది.
ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్లీ ఆత్మలోకే వెళ్లిపోతుంది. భక్తి సేయ అంటే భక్తిని చూపడం, ఆచరించడం. భక్తి అంటే అంకితభావం. ధనం కలకాలం ఉంటుందనుకోవడంలోనే నీ అజ్ఞానం ఇమిడి ఉంది. దానిని దానధర్మాలకు వెచ్చించడమేవివేకం.
ధర్మాన్ని గురించి గతంలో అనేకసార్లు ప్రస్తావించడం జరిగింది.
‘తనువు ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము’ అనేది పాఠాంతరం.
ఆశచేత మనుజులాయువు గలనాళ్ళు
తిరుగుచుందురు భ్రమ తిప్పుదాక
మురికి భాండమందు ముసురు నీగల భంగి
విశ్వదాభిరామ వినురవేమ
మురికి కుండపైన ఈగలు ముసురునట్లుగా మనిషి భౌతిక సుఖాల చుట్టూ జీవితాంతం తిరుగుతూనే ఉంటాడు. ఎన్నాళ్లు తిరుగుతాడు? ఎన్నాళ్లంటే భ్రమ తొలిగేదాక. భ్రమ తొలిగేది లేదు ఆశ చచ్చేది లేదు అని సారాంశం.
బతకడానికి ఆశ అవసరమే కాని ఇది నిరంతర అత్యాశ. అందుకే ఆశాపాశం, ఆశాబంధం అనే మాటలు పుట్టాయి. ఆశలో చిక్కుబడిపోతే అంతే సంగతులు అంటున్నాడు వేమన. ఆశను వదులుకుందామన్నా భ్రమ వదలనివ్వదు.
ఆశ అంటే కోరికే. తెలియని సుఖాలపైన ఆసక్తే ఆశ. భ్రమ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా తోపింపజేసేది. ‘ఆయువు గలనాళ్లు’ అంటే బతికి ఉన్నంతవరకు. ఆయువు అంటే వయస్సు, జీవితాన్ని పెంచేదని కూడ. ఆయుష్యం అంటే సుదీర్ఘ జీవితం. భ్రమపరిభ్రమానికి హేతువు. భ్రమ వల్లనే ఆశకు అంతటి ఆరాటం. ఉన్నదాన్ని స్పష్టంగా చూడగలిగితే తప్ప భ్రమ తొలగదు.
భ్రమను తొలగించుకోవాలనేది సందేశం. మురికి భాండమంటే మురికి కుండ. శుభ్రపరచని వంటపాత్ర కావొచ్చు. వ్యవసాయ కుటుంబాల్లోనైతే కుడితి పాత్ర కావొచ్చు. వాటికి అంటుకొని ఉన్న మురికి పదార్థం కోసం ఈగలు ముసురుకుంటాయి. భాండం అంటే కుండ, మురికి అంటే మాలిన్యం.
బ్రౌన్ flies settle on wine అని అనువాదం చేశాడు. పాశ్చాత్య సన్నివేశంలో అది వారి అనుభవం. బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లేయులనుద్దేశించి అనువదిస్తున్నానని చెప్పుకున్నాడు. తెలుగు రాని ఇంగ్లిషువారు వేమన పద్యాల ద్వారా తెలుగు నేర్చుకోవడంసులభమౌతుందని బ్రౌన్ అభిప్రాయం. ‘తిరుగుచుందురు భ్రమ తిప్పలేక’ అనేది పాఠాంతరం.
తిరుగుచుందురు భ్రమ తిప్పుదాక
మురికి భాండమందు ముసురు నీగల భంగి
విశ్వదాభిరామ వినురవేమ
మురికి కుండపైన ఈగలు ముసురునట్లుగా మనిషి భౌతిక సుఖాల చుట్టూ జీవితాంతం తిరుగుతూనే ఉంటాడు. ఎన్నాళ్లు తిరుగుతాడు? ఎన్నాళ్లంటే భ్రమ తొలిగేదాక. భ్రమ తొలిగేది లేదు ఆశ చచ్చేది లేదు అని సారాంశం.
బతకడానికి ఆశ అవసరమే కాని ఇది నిరంతర అత్యాశ. అందుకే ఆశాపాశం, ఆశాబంధం అనే మాటలు పుట్టాయి. ఆశలో చిక్కుబడిపోతే అంతే సంగతులు అంటున్నాడు వేమన. ఆశను వదులుకుందామన్నా భ్రమ వదలనివ్వదు.
ఆశ అంటే కోరికే. తెలియని సుఖాలపైన ఆసక్తే ఆశ. భ్రమ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా తోపింపజేసేది. ‘ఆయువు గలనాళ్లు’ అంటే బతికి ఉన్నంతవరకు. ఆయువు అంటే వయస్సు, జీవితాన్ని పెంచేదని కూడ. ఆయుష్యం అంటే సుదీర్ఘ జీవితం. భ్రమపరిభ్రమానికి హేతువు. భ్రమ వల్లనే ఆశకు అంతటి ఆరాటం. ఉన్నదాన్ని స్పష్టంగా చూడగలిగితే తప్ప భ్రమ తొలగదు.
భ్రమను తొలగించుకోవాలనేది సందేశం. మురికి భాండమంటే మురికి కుండ. శుభ్రపరచని వంటపాత్ర కావొచ్చు. వ్యవసాయ కుటుంబాల్లోనైతే కుడితి పాత్ర కావొచ్చు. వాటికి అంటుకొని ఉన్న మురికి పదార్థం కోసం ఈగలు ముసురుకుంటాయి. భాండం అంటే కుండ, మురికి అంటే మాలిన్యం.
బ్రౌన్ flies settle on wine అని అనువాదం చేశాడు. పాశ్చాత్య సన్నివేశంలో అది వారి అనుభవం. బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లేయులనుద్దేశించి అనువదిస్తున్నానని చెప్పుకున్నాడు. తెలుగు రాని ఇంగ్లిషువారు వేమన పద్యాల ద్వారా తెలుగు నేర్చుకోవడంసులభమౌతుందని బ్రౌన్ అభిప్రాయం. ‘తిరుగుచుందురు భ్రమ తిప్పలేక’ అనేది పాఠాంతరం.
చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు
కడకు మొదటి కులము చెడినయట్లు
పాపమొకటి గలదు ఫలమేమి లేదయా!
విశ్వదాభిరామ వినురవేమ!
అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిదిఅంటున్నాడు వేమన.
‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే’ అన్నాడు శంకరాచార్యులు ‘భజ గోవిందం’ స్తోత్రంలో. మృత్యువు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభం లేదు. దైవ ధ్యానం చేసుకో! అంటే గోవిందుణ్ని భజించు అనిసూచిస్తున్నాడు. ధాతు పాఠంలో డుకృఙ్ కరణే అంటే చేయుట అని.
ఈ సూత్రాన్ని పదే పదే అనటం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యం అని సారాంశం. ‘భజ గోవిందం’ స్తోత్రాన్ని గానకోకిల సుబ్బలక్ష్మి ఆలపిస్తుంటే కలిగే వైరాగ్య స్ఫూర్తి అంతా ఇంతా కాదు.
ఇక్కడ వేమన్న చెప్తున్న సన్నివేశం దాదాపు ఇట్లాంటిదే. ‘‘సన్యసించేదెట్లు?’’ అంటున్నాడు. ఇంతకూ సన్యాసమంటే ఏమిటి? సన్యాసమంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం. కోరికలకు సంబంధించిన పనులను వదిలెయ్యటం. ఏవో కారణాలవల్ల సన్యసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం స్వీకరిస్తే అది నిజమైన సన్యాసమవుతుంది.
చావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల గత పాపాలు పోవు. పాపమంటే ఏమిటి? పాపమంటే అధర్మ కృతం. దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో గాని చివరకది శిక్షించక మానదంటున్నాడు వేమన. కాబట్టి పాపం చేసేముందుకాస్త జాగ్రత్తగా ఉండటం మేలు అనేది వేమన్న సందేశం.
కడకు మొదటి కులము చెడినయట్లు
పాపమొకటి గలదు ఫలమేమి లేదయా!
విశ్వదాభిరామ వినురవేమ!
అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిదిఅంటున్నాడు వేమన.
‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే’ అన్నాడు శంకరాచార్యులు ‘భజ గోవిందం’ స్తోత్రంలో. మృత్యువు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభం లేదు. దైవ ధ్యానం చేసుకో! అంటే గోవిందుణ్ని భజించు అనిసూచిస్తున్నాడు. ధాతు పాఠంలో డుకృఙ్ కరణే అంటే చేయుట అని.
ఈ సూత్రాన్ని పదే పదే అనటం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యం అని సారాంశం. ‘భజ గోవిందం’ స్తోత్రాన్ని గానకోకిల సుబ్బలక్ష్మి ఆలపిస్తుంటే కలిగే వైరాగ్య స్ఫూర్తి అంతా ఇంతా కాదు.
ఇక్కడ వేమన్న చెప్తున్న సన్నివేశం దాదాపు ఇట్లాంటిదే. ‘‘సన్యసించేదెట్లు?’’ అంటున్నాడు. ఇంతకూ సన్యాసమంటే ఏమిటి? సన్యాసమంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం. కోరికలకు సంబంధించిన పనులను వదిలెయ్యటం. ఏవో కారణాలవల్ల సన్యసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం స్వీకరిస్తే అది నిజమైన సన్యాసమవుతుంది.
చావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల గత పాపాలు పోవు. పాపమంటే ఏమిటి? పాపమంటే అధర్మ కృతం. దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో గాని చివరకది శిక్షించక మానదంటున్నాడు వేమన. కాబట్టి పాపం చేసేముందుకాస్త జాగ్రత్తగా ఉండటం మేలు అనేది వేమన్న సందేశం.
ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద
మహిమ జూపువాడు మధ్యముండు
వేషధారి యుదర పోషకుండధముండు
విశ్వదాభిరామ వినురవేమ
తారతమ్యాన్ని బట్టి లోకంలో మూడు రకాల గురువులుంటారు. మొదటివాడు పరమాత్మ సంబంధమైన జ్ఞాని. ఇతడు శిష్యులకు తత్త్వజ్ఞానం బోధిస్తాడు. ఉత్తమ శ్రేణికి చెందిన గురువంటే ఇతడే. రెండోవాడు మధ్య రకం వాడు. ఇతడు జనులను ఆకట్టుకోడానికిమహిమలు చేసి చూపిస్తాడు. ఇక మూడోరకం వాడున్నాడే ఇతడు పొట్ట కూటికోసం గురువు వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. ఇతనిది అతి తక్కువ స్థాయి. ఇటువంటివారిని నమ్మకూడదంటున్నాడు వేమన.
ఉత్తమోత్తముడు అంటే ఉత్తముల్లో ఉత్తముడు. బహు శ్రేష్ఠుడన్నమాట. ఈయన ఆత్మజ్ఞాని. కోరికలు లేనివాడు. నిర్వికార స్థితికి చేరుకున్నవాడు. సద్గురువు అనే మాట ఇతనికి సరిపోతుంది. తత్త్వజ్ఞుడనే మాట పెద్దది.
మధ్యముడంటే పైవాడి కంటె తక్కువవాడు. ఇతడు జనుల్లో విశ్వాసం కల్పించటానికి మహిమలు చేసి చూపిస్తాడు. యోగ సాధనలో సమకూరే చమత్కారాలు ఇతని సొత్తు. మహిమ అంటే గొప్పతనం. అంతేకాక అణిమ, మహిమ, గరిమ అంటూ అష్ట సిద్ధుల్లోనిమహిమ కూడా కావొచ్చు. ఇతనికి కీర్తి ప్రతిష్టలపైన, భోగ భాగ్యాలపైన దృష్టి ఉంటుంది. ఇటువంటివారి వల్ల సమాజానికి నష్టం ఉండకపోవచ్చు గాని తాత్త్విక యోగి కంటే కింది స్థాయి.
ఇక మన మూడోవాడు మహానుభావుడు! పరమ లౌకికుడు. వేషానికే గురువు. బోధించేవన్నీ కల్లలు. ఉదరం అంటే కడుపు. కుక్షింభరుడన్నమాట. ఇటువంటి వారి వల్ల లోకానికి నష్టం ఉంది. కాబట్టి ఓ కంట కనిపెట్టి ఉండాలని వేమన్న హెచ్చరిక.
మహిమ జూపువాడు మధ్యముండు
వేషధారి యుదర పోషకుండధముండు
విశ్వదాభిరామ వినురవేమ
తారతమ్యాన్ని బట్టి లోకంలో మూడు రకాల గురువులుంటారు. మొదటివాడు పరమాత్మ సంబంధమైన జ్ఞాని. ఇతడు శిష్యులకు తత్త్వజ్ఞానం బోధిస్తాడు. ఉత్తమ శ్రేణికి చెందిన గురువంటే ఇతడే. రెండోవాడు మధ్య రకం వాడు. ఇతడు జనులను ఆకట్టుకోడానికిమహిమలు చేసి చూపిస్తాడు. ఇక మూడోరకం వాడున్నాడే ఇతడు పొట్ట కూటికోసం గురువు వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. ఇతనిది అతి తక్కువ స్థాయి. ఇటువంటివారిని నమ్మకూడదంటున్నాడు వేమన.
ఉత్తమోత్తముడు అంటే ఉత్తముల్లో ఉత్తముడు. బహు శ్రేష్ఠుడన్నమాట. ఈయన ఆత్మజ్ఞాని. కోరికలు లేనివాడు. నిర్వికార స్థితికి చేరుకున్నవాడు. సద్గురువు అనే మాట ఇతనికి సరిపోతుంది. తత్త్వజ్ఞుడనే మాట పెద్దది.
మధ్యముడంటే పైవాడి కంటె తక్కువవాడు. ఇతడు జనుల్లో విశ్వాసం కల్పించటానికి మహిమలు చేసి చూపిస్తాడు. యోగ సాధనలో సమకూరే చమత్కారాలు ఇతని సొత్తు. మహిమ అంటే గొప్పతనం. అంతేకాక అణిమ, మహిమ, గరిమ అంటూ అష్ట సిద్ధుల్లోనిమహిమ కూడా కావొచ్చు. ఇతనికి కీర్తి ప్రతిష్టలపైన, భోగ భాగ్యాలపైన దృష్టి ఉంటుంది. ఇటువంటివారి వల్ల సమాజానికి నష్టం ఉండకపోవచ్చు గాని తాత్త్విక యోగి కంటే కింది స్థాయి.
ఇక మన మూడోవాడు మహానుభావుడు! పరమ లౌకికుడు. వేషానికే గురువు. బోధించేవన్నీ కల్లలు. ఉదరం అంటే కడుపు. కుక్షింభరుడన్నమాట. ఇటువంటి వారి వల్ల లోకానికి నష్టం ఉంది. కాబట్టి ఓ కంట కనిపెట్టి ఉండాలని వేమన్న హెచ్చరిక.
ఆనుకూల్యము గల అంగన కలిగిన
సతికి పతికి పరమ సౌఖ్యమమరు
ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు
విశ్వదాభిరామ వినురవేమ!
ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడువేమన.
ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి.
భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టిప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది.
అప్పటి ఉమ్మడి కుటుంబాలు కూడా నేడు నామమాత్రమయ్యాయి. కాని విడిపోవడం ఆనాడూ ఈనాడూ అంత సులభం కాదు. సంఘ వ్యవస్థలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. వేదాంతాలన్నీ దీని గురించే చింతన చేస్తున్నాయి. అలాగే సి.పి.బ్రౌన్ "But if she be disagreeable, the only happiness is in quitting her'’ అనటాన్ని కేవలం పాశ్చాత్య వ్యాఖ్యగా కొట్టిపారెయ్యలేం.
ఆధిపత్యాన్ని కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఇష్టం బలంగా ఉంటే కష్టం ప్రసక్తి రాకపోవచ్చు. ఇది స్వభావాలకు సంబంధించిన సమస్య కూడా. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భారతీయ సమాజంలో, భారతీయ సమాజంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇతరసమాజాల్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు మంచి చర్చకు దారితీసి మరింత అర్థవంతమైన మానవ సంబంధాలను, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను బేరీజు వేసుకోవడానికి వీలు కల్పించవచ్చు.
ఆనుకూల్యం అంటే అనుకూలమైన భావం. హితమైన, ఆరోగ్యకరమైన ప్రవర్తన. అనుగుణమైన ఆలోచన. ప్రతికూలం కానిది అనుకూలం. మొత్తానికి ఇష్టంగా ఉండేదని. అనుకూలుడు అనేది ఒక నాయక భేదం కూడా. అనుకూలుడు అంటే ఒకే స్త్రీయందు అనురాగంగల నాయకుడు, సహచరుడు, మిత్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి.
ప్రకృతిలో కూడా సస్యానుకూల వర్షం, స్పర్శానుకూలం అనే అభివ్యక్తులున్నాయి. అనుకూల వాయువులు సరేసరి. ‘‘అనుకూల పవన మోహనమ్ములే ఈ దినమ్ములు?’’ అని రాయప్రోలు వారి తృణ కంకణంలో ఓ ప్రయోగం. ఆనుకూల్యానికి వ్యతిరేకమైందిప్రాతికూల్యం. సౌఖ్యము+అమరు. అమరు అంటే కుదరటం, ఒప్పడం.
ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలంవారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం.
సతికి పతికి పరమ సౌఖ్యమమరు
ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు
విశ్వదాభిరామ వినురవేమ!
ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడువేమన.
ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి.
భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టిప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది.
అప్పటి ఉమ్మడి కుటుంబాలు కూడా నేడు నామమాత్రమయ్యాయి. కాని విడిపోవడం ఆనాడూ ఈనాడూ అంత సులభం కాదు. సంఘ వ్యవస్థలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. వేదాంతాలన్నీ దీని గురించే చింతన చేస్తున్నాయి. అలాగే సి.పి.బ్రౌన్ "But if she be disagreeable, the only happiness is in quitting her'’ అనటాన్ని కేవలం పాశ్చాత్య వ్యాఖ్యగా కొట్టిపారెయ్యలేం.
ఆధిపత్యాన్ని కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఇష్టం బలంగా ఉంటే కష్టం ప్రసక్తి రాకపోవచ్చు. ఇది స్వభావాలకు సంబంధించిన సమస్య కూడా. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భారతీయ సమాజంలో, భారతీయ సమాజంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇతరసమాజాల్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు మంచి చర్చకు దారితీసి మరింత అర్థవంతమైన మానవ సంబంధాలను, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను బేరీజు వేసుకోవడానికి వీలు కల్పించవచ్చు.
ఆనుకూల్యం అంటే అనుకూలమైన భావం. హితమైన, ఆరోగ్యకరమైన ప్రవర్తన. అనుగుణమైన ఆలోచన. ప్రతికూలం కానిది అనుకూలం. మొత్తానికి ఇష్టంగా ఉండేదని. అనుకూలుడు అనేది ఒక నాయక భేదం కూడా. అనుకూలుడు అంటే ఒకే స్త్రీయందు అనురాగంగల నాయకుడు, సహచరుడు, మిత్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి.
ప్రకృతిలో కూడా సస్యానుకూల వర్షం, స్పర్శానుకూలం అనే అభివ్యక్తులున్నాయి. అనుకూల వాయువులు సరేసరి. ‘‘అనుకూల పవన మోహనమ్ములే ఈ దినమ్ములు?’’ అని రాయప్రోలు వారి తృణ కంకణంలో ఓ ప్రయోగం. ఆనుకూల్యానికి వ్యతిరేకమైందిప్రాతికూల్యం. సౌఖ్యము+అమరు. అమరు అంటే కుదరటం, ఒప్పడం.
ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలంవారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం.
కడుపుకేల మనస! కళవళ పడియెదు
కడుపుకేల తృప్తి కలుగుచుండు
కడుపు రాతిలోని కప్పకు గలుగదా?విశ్వదాభిరామ వినురవేమ!
ఓ పాడు మనసా! రాత్రింబవళ్లు ఈ పొట్ట కోసం ఇంతగా కలవరపడిపోతావెందుకు? ఈ చిన్ని కడుపుకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కాస్త తిండి దొరక్కపోదు. రాతిలో ఉన్న కప్పను ఎవరు కాపాడుతున్నారు? దానికి కడుపు లేదా అనిఆలోచించమంటున్నాడు వేమన.
రాతిలోని కప్పను దైవం ఏ విధంగా బతికించుకుంటూ పోషిస్తున్నాడో అట్లాగే జీవులన్నింటినీ ఆయనే చూసుకుంటున్నాడు. దిగులు వద్దు నారుపోసిన నీరు పొయ్యడా! ముందు నువ్వు చెయ్యవలసిన పని చూడు అనేది సారాంశం.
కళవళం అంటే కలత, కళవళ పాటు అంటే తొట్రుపాటు. తిండి లేదు తిండి లేదు అంటూ ఊరికే క్షోభ పడనక్కరలేదు. దానికోసం ఏదైనా చెయ్యి, లేదా భగవంతునిపైన భారం వెయ్యి. కడుపు కోసం ఏం చెయ్యాలో తోచని బలహీన మనస్కుడికి ఆలోచిస్తే ఏదో ఒక మార్గంస్ఫురించకపోదని వేమన్న సూచన. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతికే అవకాశముంది అని ఆశాప్రబోధం.
ఉదాహరణకు రాతిలో కప్ప ఉంది అంటారు. దానిని కొందరు విశ్వాసమనీ, కొందరు సృష్టిలోని చమత్కారమనీ భావిస్తారు. ద్రవ పదార్థం ఘనీభవించి కదా రాళ్లు ఏర్పడ్డాయి. కొన్ని రాళ్లలో నీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి. వాటిలో కప్పలాంటి జలచరాలు ఉంటేఉండొచ్చు. వాటికి కావలసిన జీవ వస్తువులను భగవంతుడే ఏర్పాటు చేశాడు. రాయి పగిలినప్పుడు ఆ కప్ప బయటికి వచ్చేస్తుంది.
అంతెందుకు? చీమలు భూమిలో ఎంతో లోతు దాకా వెళ్తాయి. వాటికి ప్రాణవాయువును ఎవరు అందిస్తున్నారు? శిశువుకు కూడా తల్లి గర్భంలో ఎంతో గొప్ప ఏర్పాటు ఉంది. కాబట్టి వ్యర్థాలోచనలు మాని దేవుడు చూపిన మార్గంలో మానవ ప్రయత్నం చెయ్యి, సోమరిపోతువై బాధపడితే లాభం లేదు అని వేమన్న సందేశం.
కడుపుకేల తృప్తి కలుగుచుండు
కడుపు రాతిలోని కప్పకు గలుగదా?విశ్వదాభిరామ వినురవేమ!
ఓ పాడు మనసా! రాత్రింబవళ్లు ఈ పొట్ట కోసం ఇంతగా కలవరపడిపోతావెందుకు? ఈ చిన్ని కడుపుకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కాస్త తిండి దొరక్కపోదు. రాతిలో ఉన్న కప్పను ఎవరు కాపాడుతున్నారు? దానికి కడుపు లేదా అనిఆలోచించమంటున్నాడు వేమన.
రాతిలోని కప్పను దైవం ఏ విధంగా బతికించుకుంటూ పోషిస్తున్నాడో అట్లాగే జీవులన్నింటినీ ఆయనే చూసుకుంటున్నాడు. దిగులు వద్దు నారుపోసిన నీరు పొయ్యడా! ముందు నువ్వు చెయ్యవలసిన పని చూడు అనేది సారాంశం.
కళవళం అంటే కలత, కళవళ పాటు అంటే తొట్రుపాటు. తిండి లేదు తిండి లేదు అంటూ ఊరికే క్షోభ పడనక్కరలేదు. దానికోసం ఏదైనా చెయ్యి, లేదా భగవంతునిపైన భారం వెయ్యి. కడుపు కోసం ఏం చెయ్యాలో తోచని బలహీన మనస్కుడికి ఆలోచిస్తే ఏదో ఒక మార్గంస్ఫురించకపోదని వేమన్న సూచన. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతికే అవకాశముంది అని ఆశాప్రబోధం.
ఉదాహరణకు రాతిలో కప్ప ఉంది అంటారు. దానిని కొందరు విశ్వాసమనీ, కొందరు సృష్టిలోని చమత్కారమనీ భావిస్తారు. ద్రవ పదార్థం ఘనీభవించి కదా రాళ్లు ఏర్పడ్డాయి. కొన్ని రాళ్లలో నీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి. వాటిలో కప్పలాంటి జలచరాలు ఉంటేఉండొచ్చు. వాటికి కావలసిన జీవ వస్తువులను భగవంతుడే ఏర్పాటు చేశాడు. రాయి పగిలినప్పుడు ఆ కప్ప బయటికి వచ్చేస్తుంది.
అంతెందుకు? చీమలు భూమిలో ఎంతో లోతు దాకా వెళ్తాయి. వాటికి ప్రాణవాయువును ఎవరు అందిస్తున్నారు? శిశువుకు కూడా తల్లి గర్భంలో ఎంతో గొప్ప ఏర్పాటు ఉంది. కాబట్టి వ్యర్థాలోచనలు మాని దేవుడు చూపిన మార్గంలో మానవ ప్రయత్నం చెయ్యి, సోమరిపోతువై బాధపడితే లాభం లేదు అని వేమన్న సందేశం.
ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు
మొదల పట్టుబట్టి వదలరాదు
మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా
విశ్వదాభిరామ వినురవేమ
విధానం తెలుసుకొని తాత్త్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు. మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునే దాకా వదిలిపెట్టగూడదు. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి గాని పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అదికూలిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా పద్ధతిగా చెయ్యాలని వేమన్న సారాంశం.
ఒక రకంగా శివ పూజావిధానాన్ని తెలిపే పద్యమిది. శ్రీనాథుని హరవిలాసంలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ‘పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ/ చంచన్మంత్ర ప్రాసాద పరం పరా సహిత...’ పంచబ్రహ్మాలంటే పంచ బ్రహ్మ మంత్రాలు. షడంగాలుఅంటే శరీరంలోని ఆరు అవయవాలు (రెండు చేతులు, రెండు కాళ్లు, తల, నడుము).
పూజా సమయంలో మంత్రోచ్ఛారణ పూర్వకంగా వీటిని స్పృశిస్తారు. బీజం అంటే మంత్రానికి మూలాక్షరం. అంటే ఓంకారం. ప్రాసాద పంచాక్షరీ అంటే ఓం, హ్రీం ఇత్యాదులతో కలిపి జపించే నమశ్శివాయ. ‘ఎరిగిన శివపూజ’ అంటే ఇంత ఉంది. నిజానికి చంచలమైనమనస్సును నిలపడం కోసమే శివపూజ.
భక్తి అంటే అంకిత భావం. దానికి ముందు ఉండవలసింది ఏకాగ్రత. ఏకాగ్రత అనే పునాదిపైన ఉండే భక్తి మంచి ఫలితాన్నిస్తుంది. వేమన్నే ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!’ అన్నాడు మరోచోట. చిత్తశుద్ధి అంటే మానసిక పవిత్రత. అది ఏకాగ్రత వల్లనే సాధ్యమౌతుంది. భక్తి యోగం నుండి జ్ఞాన యోగం దాకా చేరాలంటే తొలుతగా ఉండాల్సింది ఏకాగ్రతే. ‘చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద’ అని ఓ సామెత ఉంది. ఇక్కడ చిత్తం అంటే శుద్ధి లేని చిత్తమని. ఏకాగ్రత లేనప్పుడు అది శివుని పైన నిలవదు, చెప్పుల దగ్గరే ఆగిపోతుంది.
చెడిపోదు అంటే వ్యర్థం కాదని. రెండో పాదంలో ‘పట్టు పట్టడం’ అంటే ఏకాగ్రత కోసం నిరంతరం ప్రయత్నించాలని. ఇక్కడ ‘మొదల’ అంటే తొలుత, ప్రారంభం అని. మొదలు అంటే అడుగు. అడుగు నుంచి ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వస్తే గోడ ఏర్పడుతుంది.
అది క్రమానుగత పూర్వి అయినప్పుడు కూలిపోవడానికి ఆస్కారముండదు. గోడను కింది నుంచి కట్టుకుంటూ పోవాలి గాని పైన కట్టడం ప్రారంభిస్తే అది అవివేకమౌతుంది. గహనమైన వేదాంత విషయాలకు నిత్యజీవితంలోని తెలిసిన పోలికలు వాడటం వేమన్నప్రత్యేకత.
మొదల పట్టుబట్టి వదలరాదు
మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా
విశ్వదాభిరామ వినురవేమ
విధానం తెలుసుకొని తాత్త్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు. మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునే దాకా వదిలిపెట్టగూడదు. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి గాని పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అదికూలిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా పద్ధతిగా చెయ్యాలని వేమన్న సారాంశం.
ఒక రకంగా శివ పూజావిధానాన్ని తెలిపే పద్యమిది. శ్రీనాథుని హరవిలాసంలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ‘పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ/ చంచన్మంత్ర ప్రాసాద పరం పరా సహిత...’ పంచబ్రహ్మాలంటే పంచ బ్రహ్మ మంత్రాలు. షడంగాలుఅంటే శరీరంలోని ఆరు అవయవాలు (రెండు చేతులు, రెండు కాళ్లు, తల, నడుము).
పూజా సమయంలో మంత్రోచ్ఛారణ పూర్వకంగా వీటిని స్పృశిస్తారు. బీజం అంటే మంత్రానికి మూలాక్షరం. అంటే ఓంకారం. ప్రాసాద పంచాక్షరీ అంటే ఓం, హ్రీం ఇత్యాదులతో కలిపి జపించే నమశ్శివాయ. ‘ఎరిగిన శివపూజ’ అంటే ఇంత ఉంది. నిజానికి చంచలమైనమనస్సును నిలపడం కోసమే శివపూజ.
భక్తి అంటే అంకిత భావం. దానికి ముందు ఉండవలసింది ఏకాగ్రత. ఏకాగ్రత అనే పునాదిపైన ఉండే భక్తి మంచి ఫలితాన్నిస్తుంది. వేమన్నే ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!’ అన్నాడు మరోచోట. చిత్తశుద్ధి అంటే మానసిక పవిత్రత. అది ఏకాగ్రత వల్లనే సాధ్యమౌతుంది. భక్తి యోగం నుండి జ్ఞాన యోగం దాకా చేరాలంటే తొలుతగా ఉండాల్సింది ఏకాగ్రతే. ‘చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద’ అని ఓ సామెత ఉంది. ఇక్కడ చిత్తం అంటే శుద్ధి లేని చిత్తమని. ఏకాగ్రత లేనప్పుడు అది శివుని పైన నిలవదు, చెప్పుల దగ్గరే ఆగిపోతుంది.
చెడిపోదు అంటే వ్యర్థం కాదని. రెండో పాదంలో ‘పట్టు పట్టడం’ అంటే ఏకాగ్రత కోసం నిరంతరం ప్రయత్నించాలని. ఇక్కడ ‘మొదల’ అంటే తొలుత, ప్రారంభం అని. మొదలు అంటే అడుగు. అడుగు నుంచి ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వస్తే గోడ ఏర్పడుతుంది.
అది క్రమానుగత పూర్వి అయినప్పుడు కూలిపోవడానికి ఆస్కారముండదు. గోడను కింది నుంచి కట్టుకుంటూ పోవాలి గాని పైన కట్టడం ప్రారంభిస్తే అది అవివేకమౌతుంది. గహనమైన వేదాంత విషయాలకు నిత్యజీవితంలోని తెలిసిన పోలికలు వాడటం వేమన్నప్రత్యేకత.
కడక నఖిలమునకు నడి నాళమందున్న
వేగుచుక్క వంటి వెలుగు దిక్కు
వెల్గు కన్న దిక్కు వేరెవ్వరున్నారు
విశ్వదాభిరామ వినురవేమ
యోగి మాత్రమే యోగానుభవంతో చెప్పగలిగిన పద్యమిది. వేమన యోగ సిద్ధి పొందాడంటారా? అని కొందరు అడుగుతుంటారు. అలా పొంది ఉంటాడని చెప్పడానికి ఉదాహరణగా ఉన్న పద్యాలు కొల్లలు. ‘వేమన జ్ఞాన మార్గ పద్యాలు’ చాలా వరకు అట్లాంటివే.
వేగుచుక్క వంటి వెలుగు దిక్కు
వెల్గు కన్న దిక్కు వేరెవ్వరున్నారు
విశ్వదాభిరామ వినురవేమ
యోగి మాత్రమే యోగానుభవంతో చెప్పగలిగిన పద్యమిది. వేమన యోగ సిద్ధి పొందాడంటారా? అని కొందరు అడుగుతుంటారు. అలా పొంది ఉంటాడని చెప్పడానికి ఉదాహరణగా ఉన్న పద్యాలు కొల్లలు. ‘వేమన జ్ఞాన మార్గ పద్యాలు’ చాలా వరకు అట్లాంటివే.
ఆయన సమస్త ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మ నాడిని అంటుకొని ఉన్నాడు. తెల్లవారుజామున పొడిచే నక్షత్రంలా వెలుగుతున్నాడు. ఆ వెలుగే మనకు దిక్కు. ఎంత ఆలోచించినా ఆ వెలుగు కన్న దిక్కు మనకెవ్వరూ లేరు. కడక అంటే పూనిక, ప్రయత్నం, కోరికఅనే అర్థాలున్నా ఇక్కడ సాధన. అఖిలం అంటే ప్రపంచం మొత్తం.
ఇది ‘నడినాళం’. నడినాళం అంటే వెన్నెముకలోని ఇడ-పింగళ అనే నాడులకు మధ్యనుండే నాడి. సుషుమ్న అని దాని పేరు. ఇది మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముకలో వ్యాపించి ఉంటుంది. దీనినే బ్రహ్మనాడి అని కూడా అంటారు.
ఇడ అనేది మనస్సంబంధమైన నాడి. ఇది ఎడమ వైపు నుండి ప్రసరిస్తుంది. పింగళ కూడ నాడే. ఇది ఎడమ వైపుకు ప్రవహిస్తుంది.
ఇక మూలాధారం. మూలాధారమంటే అన్నిటికీ ఆధారమైంది. షట్చక్రాల్లో మొదటిది. షట్చక్రాలు శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రాలు. ఇవి స్థూల దృష్టికి కనిపించవు. సుఘమ్న దారిలో ఆరోహణ క్రమంలో మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అని ఆరు చక్రాలుంటాయి. వీటినే షట్చక్రాలంటారు.
మూలాధారం కుండలినీ శక్తి స్థానం, సుఘమ్నకాధారం, సృష్టికి మూలం కావటం వల్ల మూలాధారం అంటారు. ఇది వెన్నెముక చివర, విసర్జకావయవానికి సమీపంలో ఉండే నాలుగు దళాల యౌగిక పద్మం. సహస్రారం అంటే వెయ్యి ఆకులు గల చక్రం. అరములుఅంటే ఆకులు.
సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదేయోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి. ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్).
జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది. ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం. వేమనచెప్తున్న వెలుగు ఇదే. దీనిని వేగుచుక్కతో పోలుస్తున్నాడు. వేగుచుక్క అంటే వేగు జామున వచ్చే నక్షత్రం. శుకగ్రహం.
జ్ఞానానికి తెలివి, అనుభవం అనేవి లౌకికార్థాలు. వెలుగు అనేది యౌగికార్థం.
ఇక మూలాధారం. మూలాధారమంటే అన్నిటికీ ఆధారమైంది. షట్చక్రాల్లో మొదటిది. షట్చక్రాలు శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రాలు. ఇవి స్థూల దృష్టికి కనిపించవు. సుఘమ్న దారిలో ఆరోహణ క్రమంలో మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అని ఆరు చక్రాలుంటాయి. వీటినే షట్చక్రాలంటారు.
మూలాధారం కుండలినీ శక్తి స్థానం, సుఘమ్నకాధారం, సృష్టికి మూలం కావటం వల్ల మూలాధారం అంటారు. ఇది వెన్నెముక చివర, విసర్జకావయవానికి సమీపంలో ఉండే నాలుగు దళాల యౌగిక పద్మం. సహస్రారం అంటే వెయ్యి ఆకులు గల చక్రం. అరములుఅంటే ఆకులు.
సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదేయోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి. ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్).
జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది. ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం. వేమనచెప్తున్న వెలుగు ఇదే. దీనిని వేగుచుక్కతో పోలుస్తున్నాడు. వేగుచుక్క అంటే వేగు జామున వచ్చే నక్షత్రం. శుకగ్రహం.
జ్ఞానానికి తెలివి, అనుభవం అనేవి లౌకికార్థాలు. వెలుగు అనేది యౌగికార్థం.
దానములను సేయ ధరచేతులాడక
బహు ధనంబు గూర్చి పాతిపెట్టి
తుదను దండుగనిడి మొదలు చెడు నరుడు
విశ్వదాభిరామ వినురవేమ
ఈ మనిషి ఉన్నాడే అపార ధన రాసులను సంపాదిస్తాడు. కాని చిత్రమేమిటంటే దాన ధర్మాల రూపంలో ఒక్క పైసా అయినా విదల్చడు. పైగా వాటిని భూమిలో పాతి పెడతాడు. ఇది ఎవరి కోసం? దీని గురించి వేమన్న ఏమంటున్నాడంటే ఇతడు దానాలు చెయ్యకఅపరాధం చేశాడు. అపరాధికి ద్రవ్య శిక్ష తప్పదు. అతని మరణానంతరం అది అధికారుల పాలో, రాజుల పాలో అవుతుంది. అది అతడు చెల్లించిన దండుగ. అంతేకాదు పుణ్యం మిగలని అతని జీవితం నిర్మూలమైపోయింది. కాబట్టి సంపాదించిన దానిలో కొంతైనానలుగురి సాయానికి వెచ్చించడం మంచిది అని వేమన్న సందేశం.
చేతులాడక అంటే మనసొప్పక అని. ఇది మంచి నుడికారం. దండుగ అంటే వృథా. కాని ఇక్కడ జరిమానా. నేరం చేసిన వారికి చెల్లించాలని విధించే సొమ్ము. అపరాధి నుండి అపరాధ పరిహారంగా అధికారి తీసుకునే దండుగ గురించి హనుమకొండ శాసనం (క్రీ.శ. 1079)లో ఉంది. ఈ దండుగను రాజులు ధనవంతుల నుంచి బలాత్కారంగా తీసుకునేవారు. ఎవరినైనా బాధిస్తే దండుగ ఈనాం అని కూడా ఇచ్చేవారు. అంటే అనవసరంగా బాధించినందుకు ప్రతిఫలంగా ఇచ్చే భూమి. ‘కలవారిగని దండుగలు వెట్టె నృపుడు’ అనిప్రయోగం.
పాతిపెట్టిన ధనంతో తనకూ సుఖం లేదు. మరణిస్తే గుప్తంగా వ్యర్థంగా భూమిలోనే ఉండిపోతుంది. ఈ రకంగా కూడా ఇది దండుగే.
తుదను అంటే అవసాన వేళ. ‘మొదలు చెడు’ అంటే వేళ్లూ కొమ్మలూ లేని చెట్టులా నామ రూపాలు లేకుండా పోతాడని.
బహు ధనంబు గూర్చి పాతిపెట్టి
తుదను దండుగనిడి మొదలు చెడు నరుడు
విశ్వదాభిరామ వినురవేమ
ఈ మనిషి ఉన్నాడే అపార ధన రాసులను సంపాదిస్తాడు. కాని చిత్రమేమిటంటే దాన ధర్మాల రూపంలో ఒక్క పైసా అయినా విదల్చడు. పైగా వాటిని భూమిలో పాతి పెడతాడు. ఇది ఎవరి కోసం? దీని గురించి వేమన్న ఏమంటున్నాడంటే ఇతడు దానాలు చెయ్యకఅపరాధం చేశాడు. అపరాధికి ద్రవ్య శిక్ష తప్పదు. అతని మరణానంతరం అది అధికారుల పాలో, రాజుల పాలో అవుతుంది. అది అతడు చెల్లించిన దండుగ. అంతేకాదు పుణ్యం మిగలని అతని జీవితం నిర్మూలమైపోయింది. కాబట్టి సంపాదించిన దానిలో కొంతైనానలుగురి సాయానికి వెచ్చించడం మంచిది అని వేమన్న సందేశం.
చేతులాడక అంటే మనసొప్పక అని. ఇది మంచి నుడికారం. దండుగ అంటే వృథా. కాని ఇక్కడ జరిమానా. నేరం చేసిన వారికి చెల్లించాలని విధించే సొమ్ము. అపరాధి నుండి అపరాధ పరిహారంగా అధికారి తీసుకునే దండుగ గురించి హనుమకొండ శాసనం (క్రీ.శ. 1079)లో ఉంది. ఈ దండుగను రాజులు ధనవంతుల నుంచి బలాత్కారంగా తీసుకునేవారు. ఎవరినైనా బాధిస్తే దండుగ ఈనాం అని కూడా ఇచ్చేవారు. అంటే అనవసరంగా బాధించినందుకు ప్రతిఫలంగా ఇచ్చే భూమి. ‘కలవారిగని దండుగలు వెట్టె నృపుడు’ అనిప్రయోగం.
పాతిపెట్టిన ధనంతో తనకూ సుఖం లేదు. మరణిస్తే గుప్తంగా వ్యర్థంగా భూమిలోనే ఉండిపోతుంది. ఈ రకంగా కూడా ఇది దండుగే.
తుదను అంటే అవసాన వేళ. ‘మొదలు చెడు’ అంటే వేళ్లూ కొమ్మలూ లేని చెట్టులా నామ రూపాలు లేకుండా పోతాడని.
కడగి వట్టి యాస కడతేరనివ్వదు
యిడుములందు బెట్టి యీడ్చుగాని
పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు
విశ్వదాభిరామ వినురవేమ
అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లాగి ఇటు లాగి ఎటూ కాకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్లగ్రహించవలసిందేమిటంటే ఆశ అనేది నిన్నే కాదు లోకంలోని జనుల్లో కూడా భక్తి పుట్టడానికి ఆటంకంగా పరిణమిస్తుంది అంటున్నాడు వేమన.
బాహ్య సుఖాల కోసం అతిగా ఆశపడకు. కర్మబద్ధుడివౌతావ్, దుఃఖాల పాలవుతావ్, జన్మల్లో చిక్కుకుపోతావ్. ఆశ నిన్ను భక్తి వైపు పోనివ్వదు. భక్తి మార్గం లేకపోతే నీకు ముక్తి గమ్యం అందదు అని సారాంశం.
కడగి అంటే ఉద్యమించడం. ఇక్కడ ఇది పాదపూరణ శబ్దం కాదు. వట్టి అంటే ఉత్త అని అర్థం. దీనికి అనేక ఛాయలు. వట్టి ఆవు అంటే పాలింకిన ఆవు అని, వట్టివాడు అంటే పనికిరానివాడని, వట్టి కాళ్లు అంటే చెప్పులు లేకుండా అని. వట్టిగాలి అంటే వాన పడని గాలిఅని, ఇంకెన్నో! ఆశ అంటే కోరిక. కడ అంటే దరి, ఒడ్డు. కడతేరు అంటే సిద్ధించు. ఇడుము అంటే క్లేశం, ఆయాసం.
పుడమి అంటే భూమి, పృథివి, భూలోకమన్నమాట. పొడముట అంటే జనించడం, ఉదయించడం. ‘విభీ/షణుడున్ గైకసి గర్భవార్ధి బొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్’ అనేది ప్రయోగం.
ఒక్క ఆశ తప్ప కడగి, కడ, ఇడుము, పుడమి, పొడము వంటివన్నీ దేశీయ పదాలే కావడం గమనార్హం.
యిడుములందు బెట్టి యీడ్చుగాని
పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు
విశ్వదాభిరామ వినురవేమ
అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లాగి ఇటు లాగి ఎటూ కాకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్లగ్రహించవలసిందేమిటంటే ఆశ అనేది నిన్నే కాదు లోకంలోని జనుల్లో కూడా భక్తి పుట్టడానికి ఆటంకంగా పరిణమిస్తుంది అంటున్నాడు వేమన.
బాహ్య సుఖాల కోసం అతిగా ఆశపడకు. కర్మబద్ధుడివౌతావ్, దుఃఖాల పాలవుతావ్, జన్మల్లో చిక్కుకుపోతావ్. ఆశ నిన్ను భక్తి వైపు పోనివ్వదు. భక్తి మార్గం లేకపోతే నీకు ముక్తి గమ్యం అందదు అని సారాంశం.
కడగి అంటే ఉద్యమించడం. ఇక్కడ ఇది పాదపూరణ శబ్దం కాదు. వట్టి అంటే ఉత్త అని అర్థం. దీనికి అనేక ఛాయలు. వట్టి ఆవు అంటే పాలింకిన ఆవు అని, వట్టివాడు అంటే పనికిరానివాడని, వట్టి కాళ్లు అంటే చెప్పులు లేకుండా అని. వట్టిగాలి అంటే వాన పడని గాలిఅని, ఇంకెన్నో! ఆశ అంటే కోరిక. కడ అంటే దరి, ఒడ్డు. కడతేరు అంటే సిద్ధించు. ఇడుము అంటే క్లేశం, ఆయాసం.
పుడమి అంటే భూమి, పృథివి, భూలోకమన్నమాట. పొడముట అంటే జనించడం, ఉదయించడం. ‘విభీ/షణుడున్ గైకసి గర్భవార్ధి బొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్’ అనేది ప్రయోగం.
ఒక్క ఆశ తప్ప కడగి, కడ, ఇడుము, పుడమి, పొడము వంటివన్నీ దేశీయ పదాలే కావడం గమనార్హం.
తావసించు చోట తగనల్జడాయెనా
సౌఖ్యము గల భూమి జరుగవలయు
కొలకులింకెనేని కొంగలందుండునా?విశ్వదాభిరామ వినురవేమ
మడుగుల్లో నీళ్లు ఇంకిపోయి ఆహారం దొరక్కపోతే కొంగలు ఏం చేస్తాయి? నీళ్లున్న మరోచోటికి వలస పోతాయి. అట్లాగే ఎవరైనా తాను ఉన్న ఊరిలో ఆపదలు, బాధలు ఎదురైతే ప్రశాంతత గల మరో ఊరికి తరలిపోవడం మంచిది అనిసూచిస్తున్నాడు వేమన.
వేమన పద్యాలు కేవలం వైయక్తిక అనుభవాలు కాదు. అవి చాలా వరకు నాటి పరిస్థితులను ప్రతిబింబించాయి. విజయ నగర సామ్రాజ్యం చాలాకాలం కొన ఊపిరితోనే కొట్టుమిట్టాడింది. పాలెగాండ్లు కేంద్రాధికారాన్ని సాగనివ్వలేదు. పాలెగాళ్లమూకుమ్మడి దాడులతో గ్రామాలు తల్లడిల్లాయి. శాంతి కరువైన పల్లెల నుండి వలసలు మొదలైనాయి. బహుశా అట్లాంటి సందర్భాన్ని ఈ పద్యం ప్రతిబింబిస్తున్నదనుకోవాలి.
రాజకీయంగా గాని, సాంఘికంగా గాని, ఆర్థికంగా గాని శాంతి లేకపోతే ఎక్కడైనా జీవనోపాధి కరువౌతుంది. భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అటువంటప్పుడు మరోచోటికి వలస పోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది.
తా అంటే తాను, వ్యక్తి, వసించు చోటు అంటే నివసించే ఊరు. అలజడి (అల్జడి) అంటే అశాంతి, ఆపద, బాధ అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో అలసికె అంటారు. అంటే అలసట. తమిళంలో అలచటి, అలైచటి అంటే విసుగు. మలయాళంలో అలసల్, అలశల్ అంటే కలత. ఇంచుమించు అర్థమొక్కటే, ఇవన్నీ ఛాయాభేదాలు.
‘నృపతికి లేవలజళ్లు భయలోక లీలల యందున్’ అని ప్రయోగం. సౌఖ్యం అంటే వెసులుబాటు, హాయి. ఈ ఇంట్లో నాకు సౌఖ్యంగా లేదు అంటే సౌకర్యంగా లేదని. భూమి అంటే ఇక్కడ మరోచోట. ‘జరుగవలయు’ అంటే వెళ్లిపోవాలని. చోటుమార్పు అన్నమాట. ఇది నుడికారం. ‘అతడు జరిగిపోయినాడు’ అంటే చనిపోయాడని. ‘ఇక్కడ జరుగుబాటు లేదు’ అంటే గడవటం లేదని.
కొలకు అంటే అడవిలో ఉండే నీటి మడుగు. కొలను. కొలకులు అనేది కొలనుకు బహువచనం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రష్యాలోని సైబీరియా నుండి మన కొల్లేరుకు కొంగలు వలస వస్తాయి. కొల్లేటి కొంగలని పేరు వీటికి. ఆ సమయంలో ఇక్కడిచిన్న చేపలు, తుంగ గడ్డి, రెల్లుగడ్డి చిగుళ్లు వాటికి ఆహారం. సైబీరియాలో వాటికి ఈ సమయం ప్రతికూలం కావొచ్చు. వేలాది మైళ్లు ఎగుర్తూ రావడం విశేషం.
ఒక్కసారి అవి వచ్చేటప్పుడు అది రమణీయ దృశ్యమని అకారంలో తెల్లటి మేఘాలు కమ్మినట్లుందని అక్కడివారు చెప్తారు. అయితే అప్పటివరకు కొల్లేటి పరిసరాల్లో ఉండే పిట్టలు వీటి ధాటికి పారి పోతాయంటారు. ఈనాటి మన కలుషితపరాక్రమానికి కొంగలు కూడా ముఖం చాటేస్తున్నాయంటున్నారు.మొదటి పాదంలోని ‘తగ’ తరచుగా పాద పూరణమే. సరిపోయినట్లుగా అని అర్థం. తగుట నుంచి వచ్చిందే తగ.
సౌఖ్యము గల భూమి జరుగవలయు
కొలకులింకెనేని కొంగలందుండునా?విశ్వదాభిరామ వినురవేమ
మడుగుల్లో నీళ్లు ఇంకిపోయి ఆహారం దొరక్కపోతే కొంగలు ఏం చేస్తాయి? నీళ్లున్న మరోచోటికి వలస పోతాయి. అట్లాగే ఎవరైనా తాను ఉన్న ఊరిలో ఆపదలు, బాధలు ఎదురైతే ప్రశాంతత గల మరో ఊరికి తరలిపోవడం మంచిది అనిసూచిస్తున్నాడు వేమన.
వేమన పద్యాలు కేవలం వైయక్తిక అనుభవాలు కాదు. అవి చాలా వరకు నాటి పరిస్థితులను ప్రతిబింబించాయి. విజయ నగర సామ్రాజ్యం చాలాకాలం కొన ఊపిరితోనే కొట్టుమిట్టాడింది. పాలెగాండ్లు కేంద్రాధికారాన్ని సాగనివ్వలేదు. పాలెగాళ్లమూకుమ్మడి దాడులతో గ్రామాలు తల్లడిల్లాయి. శాంతి కరువైన పల్లెల నుండి వలసలు మొదలైనాయి. బహుశా అట్లాంటి సందర్భాన్ని ఈ పద్యం ప్రతిబింబిస్తున్నదనుకోవాలి.
రాజకీయంగా గాని, సాంఘికంగా గాని, ఆర్థికంగా గాని శాంతి లేకపోతే ఎక్కడైనా జీవనోపాధి కరువౌతుంది. భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అటువంటప్పుడు మరోచోటికి వలస పోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది.
తా అంటే తాను, వ్యక్తి, వసించు చోటు అంటే నివసించే ఊరు. అలజడి (అల్జడి) అంటే అశాంతి, ఆపద, బాధ అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో అలసికె అంటారు. అంటే అలసట. తమిళంలో అలచటి, అలైచటి అంటే విసుగు. మలయాళంలో అలసల్, అలశల్ అంటే కలత. ఇంచుమించు అర్థమొక్కటే, ఇవన్నీ ఛాయాభేదాలు.
‘నృపతికి లేవలజళ్లు భయలోక లీలల యందున్’ అని ప్రయోగం. సౌఖ్యం అంటే వెసులుబాటు, హాయి. ఈ ఇంట్లో నాకు సౌఖ్యంగా లేదు అంటే సౌకర్యంగా లేదని. భూమి అంటే ఇక్కడ మరోచోట. ‘జరుగవలయు’ అంటే వెళ్లిపోవాలని. చోటుమార్పు అన్నమాట. ఇది నుడికారం. ‘అతడు జరిగిపోయినాడు’ అంటే చనిపోయాడని. ‘ఇక్కడ జరుగుబాటు లేదు’ అంటే గడవటం లేదని.
కొలకు అంటే అడవిలో ఉండే నీటి మడుగు. కొలను. కొలకులు అనేది కొలనుకు బహువచనం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రష్యాలోని సైబీరియా నుండి మన కొల్లేరుకు కొంగలు వలస వస్తాయి. కొల్లేటి కొంగలని పేరు వీటికి. ఆ సమయంలో ఇక్కడిచిన్న చేపలు, తుంగ గడ్డి, రెల్లుగడ్డి చిగుళ్లు వాటికి ఆహారం. సైబీరియాలో వాటికి ఈ సమయం ప్రతికూలం కావొచ్చు. వేలాది మైళ్లు ఎగుర్తూ రావడం విశేషం.
ఒక్కసారి అవి వచ్చేటప్పుడు అది రమణీయ దృశ్యమని అకారంలో తెల్లటి మేఘాలు కమ్మినట్లుందని అక్కడివారు చెప్తారు. అయితే అప్పటివరకు కొల్లేటి పరిసరాల్లో ఉండే పిట్టలు వీటి ధాటికి పారి పోతాయంటారు. ఈనాటి మన కలుషితపరాక్రమానికి కొంగలు కూడా ముఖం చాటేస్తున్నాయంటున్నారు.మొదటి పాదంలోని ‘తగ’ తరచుగా పాద పూరణమే. సరిపోయినట్లుగా అని అర్థం. తగుట నుంచి వచ్చిందే తగ.
మనసులోన నున్న మమతలన్నియు గోసి దృఢము చేసి మనసు తేటపరచి
ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా
విశ్వదాభిరామ వినురవేమ
మనసులోని అహంకారాన్ని తొలగించుకోవాలి. మనసును స్థిరపరచుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. అట్లా మనసును ఉంచుకొని దేహాన్ని అదుపు చేసుకోగలిగినవాడే నిజమైన యోగి అవుతాడు అంటున్నాడు వేమన.
మనసు అంటే చిత్తం, హృదయం అని అర్థాలున్నా తాత్వికంగా చెప్పాలంటే ఇది జీవాత్మ కంటే భిన్నమైన జ్ఞాన జనక ద్రవ్యం. దీనికి మనన ధర్మం ఉంటుంది. దీనికో రూపం ఉండదు కాబట్టి ఇంద్రియాల ద్వారానే వ్యక్తమౌతుంది. లోకంలో ప్రేమికులు మనసునుపారేసుకున్నామంటారు. ఇది కవితాత్మకంగా చెప్పడం. నిజానికి పారేసుకునేది తలపులనే కాని మనసుని కాదు.
మమత అంటే నాది అనే అభిమానం. దీనిని నిర్దాక్షిణ్యంగా తీసేసుకోవాలి. కోసి అనే మాట వాడాడు వేమన. దృఢం చేసి అంటే పటిష్ఠ పరచుకొని. తేట అంటే స్వచ్ఛత, నిర్మలత్వం. తేట అంటే ఒక పదార్థంలోని సారం. ద్రవ పదార్థాలపైన తేరే భాగాన్ని తేట అంటారు. అట్లా పరిశుభ్రమైన మనస్సుతో శరీరాన్ని నిర్వహించుకోవాలి. ఇక ఘటం. ఘటం అంటే కుండ. ఇది దేహానికి సంకేతం. ఘటం అనేది శరీరానికి వేదాంత పరిభాష. ఘటం అంటే కుంభకం అనే ఒక ప్రాణాయామ భేదం కూడ.
ఘనం అంటే దృఢత్వం, దిటవు అని అర్థాలు. గట్టిదైన అని. తోడుకొన్న పెరుగులో పైదీ కిందదీ కాక నడిమి గట్టి భాగాన్ని ఘనం అంటారు. ఘనతరం అంటే మరింత గట్టిదని. యోగ సాధనకు ముందుగా కావల్సినవి నిర్మమమత్వం, మానసిక నిర్మలత్వం. ఇవిపూజకు ముందు ఇల్లు అలకటం లాంటివి. ‘మనసులోన నున్న మర్మమెల్ల దెలసి, దిట్టపరచి మనసు తేటజేసి (డి.1773-5- 2068)’ అనేవి పాఠాంతరాలు.
ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా
విశ్వదాభిరామ వినురవేమ
మనసులోని అహంకారాన్ని తొలగించుకోవాలి. మనసును స్థిరపరచుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. అట్లా మనసును ఉంచుకొని దేహాన్ని అదుపు చేసుకోగలిగినవాడే నిజమైన యోగి అవుతాడు అంటున్నాడు వేమన.
మనసు అంటే చిత్తం, హృదయం అని అర్థాలున్నా తాత్వికంగా చెప్పాలంటే ఇది జీవాత్మ కంటే భిన్నమైన జ్ఞాన జనక ద్రవ్యం. దీనికి మనన ధర్మం ఉంటుంది. దీనికో రూపం ఉండదు కాబట్టి ఇంద్రియాల ద్వారానే వ్యక్తమౌతుంది. లోకంలో ప్రేమికులు మనసునుపారేసుకున్నామంటారు. ఇది కవితాత్మకంగా చెప్పడం. నిజానికి పారేసుకునేది తలపులనే కాని మనసుని కాదు.
మమత అంటే నాది అనే అభిమానం. దీనిని నిర్దాక్షిణ్యంగా తీసేసుకోవాలి. కోసి అనే మాట వాడాడు వేమన. దృఢం చేసి అంటే పటిష్ఠ పరచుకొని. తేట అంటే స్వచ్ఛత, నిర్మలత్వం. తేట అంటే ఒక పదార్థంలోని సారం. ద్రవ పదార్థాలపైన తేరే భాగాన్ని తేట అంటారు. అట్లా పరిశుభ్రమైన మనస్సుతో శరీరాన్ని నిర్వహించుకోవాలి. ఇక ఘటం. ఘటం అంటే కుండ. ఇది దేహానికి సంకేతం. ఘటం అనేది శరీరానికి వేదాంత పరిభాష. ఘటం అంటే కుంభకం అనే ఒక ప్రాణాయామ భేదం కూడ.
ఘనం అంటే దృఢత్వం, దిటవు అని అర్థాలు. గట్టిదైన అని. తోడుకొన్న పెరుగులో పైదీ కిందదీ కాక నడిమి గట్టి భాగాన్ని ఘనం అంటారు. ఘనతరం అంటే మరింత గట్టిదని. యోగ సాధనకు ముందుగా కావల్సినవి నిర్మమమత్వం, మానసిక నిర్మలత్వం. ఇవిపూజకు ముందు ఇల్లు అలకటం లాంటివి. ‘మనసులోన నున్న మర్మమెల్ల దెలసి, దిట్టపరచి మనసు తేటజేసి (డి.1773-5- 2068)’ అనేవి పాఠాంతరాలు.
అన్ని జాడలుడిగి ఆనందకాముడై
నిన్ను నమ్మజాలు నిష్టతోడ
నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన!విశ్వదాభిరామ వినురవేమ
అన్ని మార్గాలనూ నశింపజేసుకొని కేవలం ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తాడు. అప్పుడే ధర్మాచరణంలో నీ మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు. నిజంగా చెప్తున్నాను నిన్ను పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అనిప్రబోధిస్తున్నాడు వేమన.
అన్ని జాడలు అంటే మార్గాలు, అంటే అనేక సంప్రదాయాలు, షణ్మతాలు కావొచ్చు. ఇంకా చిన్నాచితకా పలు పంథాలు కావొచ్చు. వీటన్నింటితో తల బద్దలు కొట్టుకోకుండా ఆనంద మార్గంలో వెళ్లమంటున్నాడు వేమన. ఇంతకూ ఆనందమంటేఏమిటి? అతిశయ సుఖ స్వరూపమైన ప్రేమకు నెలవైంది ఆనందం అని పెద్దలు చెప్తున్నారు. ఇంగ్లిషులో దీనిని bliss అంటారు.
బ్లిస్ అంటే పరమ సుఖం, బ్రహ్మానందమని అర్థాలు. ఆనందానికి అనేక సూక్ష్మ భేదాలున్నాయి. వాటిలో బ్రహ్మానందం, విషయానందాలు ప్రస్తుతానికి తెలుసుకోదగ్గవి. బ్రహ్మానందమంటే సుషుప్తియందు అనుభవించబడే ఆనందం. దీనికిస్వయం ప్రకాశం ఉంటుంది. విషయానందాలు అంటే ఇవి అంతఃకరణ వృత్తి విశేషాలు. అంటే ఇష్ట ప్రాప్తి వల్ల అంతర్ముఖమైన మనస్సులో ప్రతిఫలించేవి విషయానందాలు.
ఆనందకాముడు అంటే ఆనందాన్ని కోరుకునేవాడు. ఇక్కడ ఆనందమంటే పరబ్రహ్మమే.నిష్ఠ అంటే నియమ పాలన. బ్రహ్మమును తప్ప ఇతరాలను ఉపాసించరాదనే నియమం. జాడ అంటే దారి, రీతి, విధం, వైపు, గతి, వృత్తాంతం అని అర్థాలు. ఇక్కడ మార్గం. నిక్కం అంటే నిజం, నిశ్చయం, వాస్తవం, శాశ్వతత్వం అని అర్థాలు.
ఆన అంటే ఒట్టు, తోడు, ఆజ్ఞ, ప్రమాణం అని అర్థాలు. ‘నీ యాన’ అనేది చక్కని తెలుగు నుడికారం. బహుశా ‘అనుట’ నుంచి వచ్చి ఉంటుంది. నిక్కచ్చితనానికి వాడుతారు. ‘నీయాన’ అంటే నీ మీద ఒట్టు అని. ‘నా యాన’ అంటే నాపై ఒట్టుఅని. ఇంగ్లిషులో ’upon my word upon my honor' అంటారు. తెలుగులో 'నా ధర్మంగా' అనేది ఇట్లాంటిదే.
అన్ని ధర్మాలను వదిలేసి నన్ను శరణుజొచ్చాలనే గీతావాక్యం ఇట్లాంటిదే. ఉడుగు అంటే నశించు అని. ‘రోగాపమృత్యు వార్తాగంధ మెడలెను జారచోరాదుల పేరు నుడిగె’ అని ప్రయోగం.
వాక్కు శుద్ధి లేనివాడు చండాలుడు
ప్రేమ శుద్ధి లేక పెట్టు టెట్లు?నొసలు భక్తుడైన నోరు తోడేలయా!విశ్వదాభిరామ వినురవేమ
చండాలుడంటే ఎవరు? పుట్టుకతోనే అస్పృశ్యుడనే ముద్ర వేసి దూరంగా పెట్టబడినవాడు కాదు. చండాలుడంటే మాటలో స్వచ్ఛత లేనివాడు. స్నేహంలో పవిత్రత లేనివాడు. ఈ రెండూ లేక ఎంత దానం చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఇట్లాంటి వాడి నొసట భక్తి చిహ్నాలు ఉంటే ఉండొచ్చు గాని నోటికి మాత్రం క్రూరమృగాల లక్షణాలే ఉంటాయి అంటున్నాడు వేమన. దేనికైనా త్రికరణ శుద్ధి ముఖ్యం అని సారాంశం.
వాక్కు అంటే పలుకు, మాట. తేజోమయంగా ఉంటేనే అది నిజమైన వాక్కు. అది మనస్సులోంచి రావాలి. వచ్చిన తర్వాత అది ఆచరణగా మారాలి. ‘కీర పోతంబులు పలువాకు మాటలకు బొక్కుచు నంచల బట్ట దారుచున్’ అని ప్రయోగం. శుద్ధి అంటే నిర్మలత్వం, పరిశుభ్రత, ఇలా ఎన్నో అర్థాలు. ‘ఆత్మశుద్ధి లేని ఆచార మేలరా’ అన్నాడు వేమన్న మరోచోట. అలాగే భావశుద్ధి. అంటే తలపోతల్లో మైల ఉండకూడదు. వైదిక కర్మలు చెయ్యడానికి యోగ్యతను సంపాదించడానికి చేసేసంస్కారాన్ని కూడా శుద్ధి అంటారు. హస్త శుద్ధి అంటే చేతి కళల నైపుణ్యం.
ఇక దేహశుద్ధి సంగతి అందరికి తెలిసిందే. వాక్శుద్ధి లేనివాడికి దేహశుద్ధే మంచి బహుమతి.చండాలుడు అనే మాటకు క్రూర కర్ముడు అని అర్థం. కాని ఒక వర్గానికి దీనిని ఆపాదించడం వలన అది ఒక ఘోరమైన సాంఘిక అన్యాయానికి గురవటం వేల యేండ్ల చరిత్ర. వేమన్న పుట్టుకతో చండాలుడనటం తప్పు అబద్ధీకుడినేచండాలుడనాలంటున్నాడు. జన్మ చండాలునికి కాలంతరంలో మోక్షమన్నా ఉంటుందేమో కాని కర్మ చండాలునికి మాత్రం ఎప్పటికీ మోక్షం లభించదు అని లోకంలో వాడుక.
ఇక ప్రేమ. ఈ మాటకు ఈ రోజుల్లో ఎక్కువగా స్త్రీ పురుషుల మధ్య వలపుగా అనురాగంగా వాడుతున్నారు గాని ఇది చాలా పెద్దది. వాత్సల్యం, దయ లాంటివి కూడా దీనిలోకి వస్తాయి.
‘నొసలు భక్తుడైన’ అంటే నుదుటిపైన నామాలు ధరిస్తేనో, బూడిద పూసుకుంటేనో, తిలకం పెట్టుకుంటేనో అంత మాత్రాన్నే భక్తుడవుతాడా? అది బాహ్య వేషం. లోపల కూడా ప్రేమ, దయ ఉన్నప్పుడే అది నిజమైన భక్తి. తోడేలు నక్క లాంటిజంతువు. అడవికుక్క అని కూడా అంటారు. క్రూరమైందే. సంస్కృతంలో వృకము, ఈహా మృగము అంటారు.
ప్రేమ శుద్ధి లేక పెట్టు టెట్లు?నొసలు భక్తుడైన నోరు తోడేలయా!విశ్వదాభిరామ వినురవేమ
చండాలుడంటే ఎవరు? పుట్టుకతోనే అస్పృశ్యుడనే ముద్ర వేసి దూరంగా పెట్టబడినవాడు కాదు. చండాలుడంటే మాటలో స్వచ్ఛత లేనివాడు. స్నేహంలో పవిత్రత లేనివాడు. ఈ రెండూ లేక ఎంత దానం చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఇట్లాంటి వాడి నొసట భక్తి చిహ్నాలు ఉంటే ఉండొచ్చు గాని నోటికి మాత్రం క్రూరమృగాల లక్షణాలే ఉంటాయి అంటున్నాడు వేమన. దేనికైనా త్రికరణ శుద్ధి ముఖ్యం అని సారాంశం.
వాక్కు అంటే పలుకు, మాట. తేజోమయంగా ఉంటేనే అది నిజమైన వాక్కు. అది మనస్సులోంచి రావాలి. వచ్చిన తర్వాత అది ఆచరణగా మారాలి. ‘కీర పోతంబులు పలువాకు మాటలకు బొక్కుచు నంచల బట్ట దారుచున్’ అని ప్రయోగం. శుద్ధి అంటే నిర్మలత్వం, పరిశుభ్రత, ఇలా ఎన్నో అర్థాలు. ‘ఆత్మశుద్ధి లేని ఆచార మేలరా’ అన్నాడు వేమన్న మరోచోట. అలాగే భావశుద్ధి. అంటే తలపోతల్లో మైల ఉండకూడదు. వైదిక కర్మలు చెయ్యడానికి యోగ్యతను సంపాదించడానికి చేసేసంస్కారాన్ని కూడా శుద్ధి అంటారు. హస్త శుద్ధి అంటే చేతి కళల నైపుణ్యం.
ఇక దేహశుద్ధి సంగతి అందరికి తెలిసిందే. వాక్శుద్ధి లేనివాడికి దేహశుద్ధే మంచి బహుమతి.చండాలుడు అనే మాటకు క్రూర కర్ముడు అని అర్థం. కాని ఒక వర్గానికి దీనిని ఆపాదించడం వలన అది ఒక ఘోరమైన సాంఘిక అన్యాయానికి గురవటం వేల యేండ్ల చరిత్ర. వేమన్న పుట్టుకతో చండాలుడనటం తప్పు అబద్ధీకుడినేచండాలుడనాలంటున్నాడు. జన్మ చండాలునికి కాలంతరంలో మోక్షమన్నా ఉంటుందేమో కాని కర్మ చండాలునికి మాత్రం ఎప్పటికీ మోక్షం లభించదు అని లోకంలో వాడుక.
ఇక ప్రేమ. ఈ మాటకు ఈ రోజుల్లో ఎక్కువగా స్త్రీ పురుషుల మధ్య వలపుగా అనురాగంగా వాడుతున్నారు గాని ఇది చాలా పెద్దది. వాత్సల్యం, దయ లాంటివి కూడా దీనిలోకి వస్తాయి.
‘నొసలు భక్తుడైన’ అంటే నుదుటిపైన నామాలు ధరిస్తేనో, బూడిద పూసుకుంటేనో, తిలకం పెట్టుకుంటేనో అంత మాత్రాన్నే భక్తుడవుతాడా? అది బాహ్య వేషం. లోపల కూడా ప్రేమ, దయ ఉన్నప్పుడే అది నిజమైన భక్తి. తోడేలు నక్క లాంటిజంతువు. అడవికుక్క అని కూడా అంటారు. క్రూరమైందే. సంస్కృతంలో వృకము, ఈహా మృగము అంటారు.
ఆపగాలి వెంట అడవుల వెంటను
కొండరాళ్ల వెంట గొడవ నేల
ఉల్లమందె శివుడటుండుట తెలియరు
విశ్వదాభిరామ వినురవేమ
పుణ్య తీర్థాలంటూ క్షేత్రాలంటూ నదీ తీరాలకు తరలి వెళ్లడమెందుకు? అరణ్యాల్లో సంచరించడమెందుకు? కొండల్లో ఆయాస పడడమెందుకు? శివుడు నీ శరీరం లేదా హృదయంలోనే ఉన్నాడు కదా! బయట వెతికి గందరగోళానికి గురికావటమెందుకు అని ప్రశ్నిస్తున్నాడు వేమన. ఒక తాత్త్విక స్థాయిలో తీర్థ యాత్రలను నిరుత్సాహపరుస్తూ వేమన అనేక పద్యాలు చెప్పాడు. వాటిలో ఇది మరొక మంచి రత్నం.
ఆపగాలి అంటే (ఆపగ+ఆలి) నదుల సమూహం అంటే వేణీ సంగమం. ఆలి (ఆళి) అంటే వరుస లేదా సమూహం. ఆపగ అంటే నది కావొచ్చు, యేరు కావొచ్చు. అప్ అంటే నీరు. ఆపగ అంటే నీటితో గమించేది, అంటే వెళ్లేది అని అర్థం, ప్రవాహమన్న మాట! ఆపగాలి అనే సమాసం నాకు తెలిసినంతవరకు ఎవరూ వాడినట్టు లేదు.
కొత్త సమాసాలు కూర్చటం మహాకవుల లక్షణం. uninvolved constructions అంటారు ఇట్లాంటి వాటిని. ‘గొడవనేల’ అంటున్నాడు వేమన. గొడవ అంటే మనకు తెలిసిందే. ఇబ్బంది, అలజడి అంటూ ఇంకా సందర్భాన్ని బట్టి ఎన్నో ఛాయలు. కన్నడంలో ‘గొడవె’ అంటే గందరగోళం.
‘నీవు చదివింతు వనుచు నన్నియును విడిచి
బిచ్చమెత్తంగ రాదుగా బేల తపసి
కడవ నాడకు చాలు నీ గొడవయేల
వెజ్జుదనమేల యని మది లజ్జవొడమి’ అనేది ప్రయోగం.
ఉల్లమంటే హృదయం.
తీర్థాలు సాధారణంగా నదుల, యేరుల దగ్గర వెలసి ఉంటాయి. త్రివేణీ సంగమం, ఏడు పాయల దుర్గ ఇట్లాంటివి. కొండలపైన అరణ్యాల్లో వెలసిన శ్రీశైలం, తిరుమల, సింహాచలం, అహోబిలం లాంటివి క్షేత్రాలు. లోపల భక్తి లేనప్పుడు వీటి సందర్శనం వల్ల అంత ప్రయోజనం లేదంటున్నాడు వేమన. ‘చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా!’ అన్నాడు గతంలో. ఈ పద్యంలో శివుడంటే శివుడే కానక్కరలేదు. దేవుడు, పరమేశ్వరుడన్నమాట! అంతా నీలోనే ఉంది, బయట దొరికేది స్వల్పం. అంతా తిరిగి మళ్లీ నువ్వు నీలోకి రాక తప్పదు అని సారాంశం.
కొండరాళ్ల వెంట గొడవ నేల
ఉల్లమందె శివుడటుండుట తెలియరు
విశ్వదాభిరామ వినురవేమ
పుణ్య తీర్థాలంటూ క్షేత్రాలంటూ నదీ తీరాలకు తరలి వెళ్లడమెందుకు? అరణ్యాల్లో సంచరించడమెందుకు? కొండల్లో ఆయాస పడడమెందుకు? శివుడు నీ శరీరం లేదా హృదయంలోనే ఉన్నాడు కదా! బయట వెతికి గందరగోళానికి గురికావటమెందుకు అని ప్రశ్నిస్తున్నాడు వేమన. ఒక తాత్త్విక స్థాయిలో తీర్థ యాత్రలను నిరుత్సాహపరుస్తూ వేమన అనేక పద్యాలు చెప్పాడు. వాటిలో ఇది మరొక మంచి రత్నం.
ఆపగాలి అంటే (ఆపగ+ఆలి) నదుల సమూహం అంటే వేణీ సంగమం. ఆలి (ఆళి) అంటే వరుస లేదా సమూహం. ఆపగ అంటే నది కావొచ్చు, యేరు కావొచ్చు. అప్ అంటే నీరు. ఆపగ అంటే నీటితో గమించేది, అంటే వెళ్లేది అని అర్థం, ప్రవాహమన్న మాట! ఆపగాలి అనే సమాసం నాకు తెలిసినంతవరకు ఎవరూ వాడినట్టు లేదు.
కొత్త సమాసాలు కూర్చటం మహాకవుల లక్షణం. uninvolved constructions అంటారు ఇట్లాంటి వాటిని. ‘గొడవనేల’ అంటున్నాడు వేమన. గొడవ అంటే మనకు తెలిసిందే. ఇబ్బంది, అలజడి అంటూ ఇంకా సందర్భాన్ని బట్టి ఎన్నో ఛాయలు. కన్నడంలో ‘గొడవె’ అంటే గందరగోళం.
‘నీవు చదివింతు వనుచు నన్నియును విడిచి
బిచ్చమెత్తంగ రాదుగా బేల తపసి
కడవ నాడకు చాలు నీ గొడవయేల
వెజ్జుదనమేల యని మది లజ్జవొడమి’ అనేది ప్రయోగం.
ఉల్లమంటే హృదయం.
తీర్థాలు సాధారణంగా నదుల, యేరుల దగ్గర వెలసి ఉంటాయి. త్రివేణీ సంగమం, ఏడు పాయల దుర్గ ఇట్లాంటివి. కొండలపైన అరణ్యాల్లో వెలసిన శ్రీశైలం, తిరుమల, సింహాచలం, అహోబిలం లాంటివి క్షేత్రాలు. లోపల భక్తి లేనప్పుడు వీటి సందర్శనం వల్ల అంత ప్రయోజనం లేదంటున్నాడు వేమన. ‘చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా!’ అన్నాడు గతంలో. ఈ పద్యంలో శివుడంటే శివుడే కానక్కరలేదు. దేవుడు, పరమేశ్వరుడన్నమాట! అంతా నీలోనే ఉంది, బయట దొరికేది స్వల్పం. అంతా తిరిగి మళ్లీ నువ్వు నీలోకి రాక తప్పదు అని సారాంశం.
బందెతాళ్ల దెచ్చి బంధించి కట్టంగ
లింగడేమి దొంగిలించినాడొ
ఆత్మలింగమేల నర్పించి చూడరో
విశ్వదాభిరామ వినురవేమ
లింగడేమి దొంగిలించినాడొ
ఆత్మలింగమేల నర్పించి చూడరో
విశ్వదాభిరామ వినురవేమ
లింగాన్ని కట్టుకున్నారేమి? అరె! కట్టుతాళ్లతో గుచ్చి దొంగలాగ బంధించి మెడలో కట్టుకున్నారేమి? లింగడు (అంటే శివుడు) ఏం దొంగతనం చేశాడని! బాహ్య లింగాన్ని పట్టుకోవడం మాని భావలింగాన్ని ఆరాధించడం మంచిది కదా! అని ఆనాటి ఆరాధ్య శైవులనువెక్కిరిస్తున్నాడు వేమన. సాధారణ శిలాలింగమైతే ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు. ఆత్మలింగమైతే ఎడబాయకుండా తనతోనే ఉంటుందని తాత్పర్యం.
వీరశైవం శైవం నుంచి వచ్చిన ఒక శాఖ. పండితారాధ్యుడు స్థాపించిన ఆరాధ్య సంప్రదాయం వీరశైవంలోని మరో అవాంతర శాఖ. ఆరాధ్యులు మెడలో లింగకాయ ధరించినా వీరశైవుల్లా వర్ణాశ్రమ ధర్మాన్ని నిరాకరించరు. వీరశైవులు దర్శనపరంగా శివ విశిష్టాద్వైతులు. అయితే మాయావాదాన్ని అంగీకరించరు.
వీరశైవంలో స్థలం, లింగం, అంగం అనేవి ముఖ్యమైన మాటలు. లింగం అంటే జీవుల పట్ల జాలితో లింగరూపం ధరించిన ఉపాస్య దేవత. అంగం అంటే దేవుడు. లింగం కూడా మూడు రకాలు. 1. ప్రాణలింగం. దీనికి రూపం ఉంటుంది. 2. ఇష్టలింగం. ఇది అర్చించుకునేసౌకర్యాన్ని కలిగిస్తుంది. 3. ఇక భావలింగం అంతర దృష్టికి మాత్రమే కనిపిస్తుంది. వేమన్న మాట్లాడుతున్నది దీని గురించే!
వీరశైవంలో మానవ శరీరంతో లింగానికి అభేదాన్ని కల్పించారు. అంటే అంగానికీ లింగానికీ అద్వైతం సూచించబడింది. జీవుడు తన అవధులన్నింటినీ తొలగించుకొని, తనలోనే ఒక నిరవధిక మహాతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలంటున్నాడు వేమన.
వేయి విధములమర వేమన పద్యముల్
అర్థమిచ్చువాని నరసి చూడ
చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినురవేమ
ఈ పద్యం వేమన్న పద్యాల్లో ఉన్నా వేమన్న పద్యాల గురించి ఇది లోకంలోని వాడుక అయి ఉంటుంది. బ్రౌన్ కూడా ‘వేయి విధములను’ Thousand interpretations అన్నాడు.'చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు'ను If thou think on these, this shall produce refined wisdom in thee అని వ్యాఖ్యానించాడు. ఈ లక్షణం వల్ల వేమన విలక్షణమైన మహాకవిగా, విశిష్టమైన ప్రజాయోగిగా విలసిల్లుతున్నాడని భావించవచ్చు.
‘మేడపైనా అలపైడి బొమ్మ/ నీడనే చిలకమ్మా’ అన్నాడు దేవదాసులో సినీకవి. దీనిని ఆ రోజుల్లో తాగుబోతు వ్యక్తావ్యక్తాలాపనగా భావించేవారు. కొందరు వేదాంతార్థాల్ని కూడా వెతికేవారు. తరువాత ఎప్పుడో సీనియర్ సముద్రాల ఎక్కడో మాట్లాడుతూ ‘మేడపైనఅలపైడి బొమ్మ’ అంటే పార్వతి అనీ, ‘నీడలో చిలకమ్మా’ అంటే చంద్రముఖి అని కథాపరంగా గుట్టు విప్పాడు. అవాంతర సందర్భంగా ఈ ప్రసక్తిని ఇక్కడ తీసుకొచ్చాడు.
ఇక వేమన పద్యంలో ‘మేడ’ ఏమిటి? మానవ శరీరమా? అయితే ‘మెచ్చుల పడుచు’ నాలుక కావాలి. నాలుక పలుకునకు ప్రతీక గదా! మంచి వాక్కుల్లో మంచి భావమే ఉంటుంది. ఆ భావమే మోక్షానికి సాధనమవుతుంది.
లేదా మేడ ఆకాశం కావొచ్చు. ఆకాశానికి శబ్ద గుణముంటుంది. మేఘధ్వని శబ్దమే. దీని గురించి వేదాల్లో కూడా వర్ణన ఉంది. మేఘాల్లోని మెరుపే మెచ్చుల పడుచు. భాషా వాఙ్మయమే భావం. ఆ భావం నుండే పరలోకానుభవం కలుగుతుంది. ఇలా ఒకటి రెండుప్రయత్నాలు. అప్పటివరకు దీని గురించి అసలు సారాంశం చెప్పగలిగే జ్ఞాని కోసం ఎదురుచూద్దాం.
అర్థమిచ్చువాని నరసి చూడ
చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినురవేమ
ఈ పద్యం వేమన్న పద్యాల్లో ఉన్నా వేమన్న పద్యాల గురించి ఇది లోకంలోని వాడుక అయి ఉంటుంది. బ్రౌన్ కూడా ‘వేయి విధములను’ Thousand interpretations అన్నాడు.'చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు'ను If thou think on these, this shall produce refined wisdom in thee అని వ్యాఖ్యానించాడు. ఈ లక్షణం వల్ల వేమన విలక్షణమైన మహాకవిగా, విశిష్టమైన ప్రజాయోగిగా విలసిల్లుతున్నాడని భావించవచ్చు.
‘మేడపైనా అలపైడి బొమ్మ/ నీడనే చిలకమ్మా’ అన్నాడు దేవదాసులో సినీకవి. దీనిని ఆ రోజుల్లో తాగుబోతు వ్యక్తావ్యక్తాలాపనగా భావించేవారు. కొందరు వేదాంతార్థాల్ని కూడా వెతికేవారు. తరువాత ఎప్పుడో సీనియర్ సముద్రాల ఎక్కడో మాట్లాడుతూ ‘మేడపైనఅలపైడి బొమ్మ’ అంటే పార్వతి అనీ, ‘నీడలో చిలకమ్మా’ అంటే చంద్రముఖి అని కథాపరంగా గుట్టు విప్పాడు. అవాంతర సందర్భంగా ఈ ప్రసక్తిని ఇక్కడ తీసుకొచ్చాడు.
ఇక వేమన పద్యంలో ‘మేడ’ ఏమిటి? మానవ శరీరమా? అయితే ‘మెచ్చుల పడుచు’ నాలుక కావాలి. నాలుక పలుకునకు ప్రతీక గదా! మంచి వాక్కుల్లో మంచి భావమే ఉంటుంది. ఆ భావమే మోక్షానికి సాధనమవుతుంది.
లేదా మేడ ఆకాశం కావొచ్చు. ఆకాశానికి శబ్ద గుణముంటుంది. మేఘధ్వని శబ్దమే. దీని గురించి వేదాల్లో కూడా వర్ణన ఉంది. మేఘాల్లోని మెరుపే మెచ్చుల పడుచు. భాషా వాఙ్మయమే భావం. ఆ భావం నుండే పరలోకానుభవం కలుగుతుంది. ఇలా ఒకటి రెండుప్రయత్నాలు. అప్పటివరకు దీని గురించి అసలు సారాంశం చెప్పగలిగే జ్ఞాని కోసం ఎదురుచూద్దాం.
పక్షిమీద నొక్క వృక్షము పుట్టెను
వృక్షము పదమూడు విత్తులయ్యె
విత్తులందు నుండు వృక్షమాలించుమీ!
విశ్వదాభిరామ వినురవేమ
పక్షి కారణంగా ఒక చెట్టు పుట్టి పెద్ద వృక్షమయ్యింది. ఆ వృక్షానికి అనేకమైన విత్తులు ఏర్పడ్డాయి. గమనిస్తే, ఇక ఆ విత్తులు ప్రతిదానిలో ఒక్కో వృక్షం సుప్తావస్థలో ఉంటుంది. ఏమైనా అర్థమయ్యిందా? ఒక రకంగా ఇది పొడుపు కథలాంటిపద్యం. లౌకికార్థంలో దీనిని విప్పడం కష్టమే. రెక్కలు గల దానిని పక్షి అంటారు అంటే సరిపోదు. ఒక తాత్త్వికార్థానికి పక్షి, వృక్షం, విత్తు అనేవి ప్రతీకలనుకుంటే కొంత ప్రయత్నించవచ్చు.
పక్షి అంటే సృష్టి. వృక్షం అంటే శరీరం. పదమూడు విత్తులేమో శరీరంలోని త్రయోదశ తత్త్వాలు. సృష్టి మూలకమైన మానవ దేహంలో పదమూడు రకాల అంశాలున్నాయంటున్నాడు వేమన. అవి వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, విజ్ఞానం, అన్నం, జలం, తేజస్సు, అగ్ని, ఆకాశం, మన్మథుడు, ఆశ. వీటన్నింటికీ మూలం ప్రాణం.
వాక్కు వ్యక్తీకరిస్తుంది. మనస్సు ఆలోచిస్తుంది. సంకల్పం స్థిరంగా ఉంచుతుంది. చిత్తం చపలంగా ఉంటుంది. ధ్యానం ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. అన్నం, జలం శరీరాన్ని పోషిస్తాయి. తేజస్సు అంటే అగ్ని, జఠరాగ్ని లాంటివి. ఆకాశం శబ్ద స్వభావం గలది, మన్మథుడు కోరికలు కలిగిస్తాడు. ఆశ చూసిందెల్లా కావాలంటుంది. ఇంక అనేక రకాలుగా వీటికి అర్థాలు చెప్పుకోవచ్చు. గహనమైన వేదాంత విషయాలు కూడా వేమన్న చేతిలో క్రీడలాగభాసిస్తాయి అని దీని వల్ల భావించవచ్చు.
వృక్షము పదమూడు విత్తులయ్యె
విత్తులందు నుండు వృక్షమాలించుమీ!
విశ్వదాభిరామ వినురవేమ
పక్షి కారణంగా ఒక చెట్టు పుట్టి పెద్ద వృక్షమయ్యింది. ఆ వృక్షానికి అనేకమైన విత్తులు ఏర్పడ్డాయి. గమనిస్తే, ఇక ఆ విత్తులు ప్రతిదానిలో ఒక్కో వృక్షం సుప్తావస్థలో ఉంటుంది. ఏమైనా అర్థమయ్యిందా? ఒక రకంగా ఇది పొడుపు కథలాంటిపద్యం. లౌకికార్థంలో దీనిని విప్పడం కష్టమే. రెక్కలు గల దానిని పక్షి అంటారు అంటే సరిపోదు. ఒక తాత్త్వికార్థానికి పక్షి, వృక్షం, విత్తు అనేవి ప్రతీకలనుకుంటే కొంత ప్రయత్నించవచ్చు.
పక్షి అంటే సృష్టి. వృక్షం అంటే శరీరం. పదమూడు విత్తులేమో శరీరంలోని త్రయోదశ తత్త్వాలు. సృష్టి మూలకమైన మానవ దేహంలో పదమూడు రకాల అంశాలున్నాయంటున్నాడు వేమన. అవి వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, విజ్ఞానం, అన్నం, జలం, తేజస్సు, అగ్ని, ఆకాశం, మన్మథుడు, ఆశ. వీటన్నింటికీ మూలం ప్రాణం.
వాక్కు వ్యక్తీకరిస్తుంది. మనస్సు ఆలోచిస్తుంది. సంకల్పం స్థిరంగా ఉంచుతుంది. చిత్తం చపలంగా ఉంటుంది. ధ్యానం ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. అన్నం, జలం శరీరాన్ని పోషిస్తాయి. తేజస్సు అంటే అగ్ని, జఠరాగ్ని లాంటివి. ఆకాశం శబ్ద స్వభావం గలది, మన్మథుడు కోరికలు కలిగిస్తాడు. ఆశ చూసిందెల్లా కావాలంటుంది. ఇంక అనేక రకాలుగా వీటికి అర్థాలు చెప్పుకోవచ్చు. గహనమైన వేదాంత విషయాలు కూడా వేమన్న చేతిలో క్రీడలాగభాసిస్తాయి అని దీని వల్ల భావించవచ్చు.
కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి
ఎట్టివారు మెత్తు రట్టివాని
మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా
విశ్వదాభిరామ వినురవేమ
ఒక చెడ్డవాడూ మంచివాడూ ఉన్నారనుకోండి. వారిద్దరిలో ఒకరిని ఎంచుకొమ్మంటే, చెడ్డవాడు చెడ్డవాణ్నే ఎంచుకుంటాడు. మంచివాణ్ని వదిలేస్తాడు. అంటే ఎటువంటి వారైనా తమలాంటి వారినే ఇష్టపడతారు. పైగా మెచ్చుకుంటారు. ఇదెట్లాఉంటుందంటే చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది గాని, అదనంగా జ్ఞానాన్ని ప్రసాదించలేదు కదా! అంటున్నాడు వేమన.
‘స్వభావో దురతిక్రమః’ అంటారు. అంటే ఎవరూ తమ సహజ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించరు అని. కూళ అంటే నీచుడు, మూఢుడు, అవివేకి, దుర్జనుడు అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో కూడ కూళ, తమిళంలో కూళై. వేమన్నేమరోచోట..
.తలకు నెరలు వచ్చి తనువెంత వడలిన
కూళ విటుడు యువతి కూడుటెల్ల
పండ్లు వడ్డ కుక్క పసరము చీకదా! అన్నాడు.
దూలం అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇంటి గోడలపై అడ్డంగా వేసే కట్టె. లేదా ఇంటికి కప్పు వేసేటప్పుడు వాసాలకు ఆధారంగా వేసే దొడ్డుకట్టెను దూలమంటారు. చెట్టుకు గానీ, దూలానికి గానీ కట్టెతనం సమానం. అంతవరకే పోలికను తీసుకుంటేఈ దృష్టాంతం కుదురుతుంది.నువ్వు సజ్జనుడివై ఎదుటి సజ్జనుణ్ని ఆదరించటం మంచిది అని వేమన్న సారాంశం.
‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనేది పాఠాంతరం
ఎట్టివారు మెత్తు రట్టివాని
మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా
విశ్వదాభిరామ వినురవేమ
ఒక చెడ్డవాడూ మంచివాడూ ఉన్నారనుకోండి. వారిద్దరిలో ఒకరిని ఎంచుకొమ్మంటే, చెడ్డవాడు చెడ్డవాణ్నే ఎంచుకుంటాడు. మంచివాణ్ని వదిలేస్తాడు. అంటే ఎటువంటి వారైనా తమలాంటి వారినే ఇష్టపడతారు. పైగా మెచ్చుకుంటారు. ఇదెట్లాఉంటుందంటే చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది గాని, అదనంగా జ్ఞానాన్ని ప్రసాదించలేదు కదా! అంటున్నాడు వేమన.
‘స్వభావో దురతిక్రమః’ అంటారు. అంటే ఎవరూ తమ సహజ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించరు అని. కూళ అంటే నీచుడు, మూఢుడు, అవివేకి, దుర్జనుడు అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో కూడ కూళ, తమిళంలో కూళై. వేమన్నేమరోచోట..
.తలకు నెరలు వచ్చి తనువెంత వడలిన
కూళ విటుడు యువతి కూడుటెల్ల
పండ్లు వడ్డ కుక్క పసరము చీకదా! అన్నాడు.
దూలం అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇంటి గోడలపై అడ్డంగా వేసే కట్టె. లేదా ఇంటికి కప్పు వేసేటప్పుడు వాసాలకు ఆధారంగా వేసే దొడ్డుకట్టెను దూలమంటారు. చెట్టుకు గానీ, దూలానికి గానీ కట్టెతనం సమానం. అంతవరకే పోలికను తీసుకుంటేఈ దృష్టాంతం కుదురుతుంది.నువ్వు సజ్జనుడివై ఎదుటి సజ్జనుణ్ని ఆదరించటం మంచిది అని వేమన్న సారాంశం.
‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనేది పాఠాంతరం
ఇలా మన వేమన గారు రాసిన పద్యాలూ ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా ఒక్కొక్కటిగా ఈ జాబితా లో చేరుస్తాను.
No comments:
Post a Comment