శ్రీరుక్మిణీశ కేశవ
నారద సంకీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యము తోడ మమ్ము గాపుము కృష్ణా!
నారద సంకీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యము తోడ మమ్ము గాపుము కృష్ణా!
ప్రతిపదార్థం: శ్రీ అంటే లక్ష్మీదేవి అవతారంగా పుట్టిన; రుక్మిణి అంటే విదర్భ రాజైన భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణీదేవికి; ఈశ అంటే భర్త అయినటువంటి వాడా; కేశవ అంటే పరమేశ్వరా; నారద అంటే నారదుడు అనే పేరుగల ఋషి ఆలపించే; సంగీత అంటేగానమునందు; లోల అంటే ఆసక్తి కలవాడా; నగ అంటే కొండను; ధరా అంటే ధరించినవాడా; శౌరీ అంటే ప్రతాపము కలవాడా; ద్వారక అంటే ద్వారక అను పేరు గల నగరంలో; నిలయ అంటే నివసించేవాడా; జనార్దన శిష్టులైన వారిని రక్షించువాడా; కృష్ణా అంటే ఓశ్రీకృష్ణా! కారుణ్యము తోడన్ అంటే దయతో; మమ్ము అంటే మమ్మల్ని అందరినీ; కావుము అంటే రక్షించుము.
భావం: ఓ శ్రీకృష్ణా! నువ్వు రుక్మిణీ దేవికి భర్తవు. పరమేశ్వరుడవు. నారద మహర్షి చేసే గానమునందు ఆసక్తి ఉన్నవాడివి. గోవర్థనమనే కొండను ఎత్తినవాడివి. ద్వారకానగరంలో నివసించినవాడవు. జనులు అనే రాక్షసులను చంపినవాడవు. ఇన్ని విధాలుగాగొప్పవాడివయిన నీవు మావంటి మానవులను దయతో రక్ష్మించుము.
శ్రీకృష్ణుని గురించిన సమాచారాన్ని కవి ఈ పద్యంలో ఎంతో అందంగా వివరించాడు. ఆయనను మనం ఎందుకు పూజించాలో తెలియచేయడానికి శ్రీకృష్ణుడిలో దైవలక్షణాలను కేవలం నాలుగు వాక్యాలలో ఎంతో సులువుగా తెలియచేశాడు. వేమన, సుమతీ శతకాలతరవాత అంతే తేలికగా ఉన్న శతకం శ్రీకృష్ణశతకం.
భావం: ఓ శ్రీకృష్ణా! నువ్వు రుక్మిణీ దేవికి భర్తవు. పరమేశ్వరుడవు. నారద మహర్షి చేసే గానమునందు ఆసక్తి ఉన్నవాడివి. గోవర్థనమనే కొండను ఎత్తినవాడివి. ద్వారకానగరంలో నివసించినవాడవు. జనులు అనే రాక్షసులను చంపినవాడవు. ఇన్ని విధాలుగాగొప్పవాడివయిన నీవు మావంటి మానవులను దయతో రక్ష్మించుము.
శ్రీకృష్ణుని గురించిన సమాచారాన్ని కవి ఈ పద్యంలో ఎంతో అందంగా వివరించాడు. ఆయనను మనం ఎందుకు పూజించాలో తెలియచేయడానికి శ్రీకృష్ణుడిలో దైవలక్షణాలను కేవలం నాలుగు వాక్యాలలో ఎంతో సులువుగా తెలియచేశాడు. వేమన, సుమతీ శతకాలతరవాత అంతే తేలికగా ఉన్న శతకం శ్రీకృష్ణశతకం.
నీవే తల్లివిఁ దండ్రివి
నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!
నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!
భావం: ఓ కృష్ణా! నువ్వే నాకు తల్లి, తండ్రి. నిరంతరం నన్ను వెంటాడుతూ, నాకు తోడునీడగా ఉండేది నీవే. నీవే నాకు స్నేహితుడివి. నాకు గురువు, దేవుడు కూడా నీవే. నీవే నాకు ప్రభువు. నాకు దిక్కు నీవే. నా సమస్తము నీవే.
కృష్ణా అంటే ఓ కృష్ణా; నిజముగ అంటే వాస్తవంగా; నీవే అంటే నువ్వే; నాకు అంటే నిన్ను పూజించే నాకు; తల్లివి అంటే కనిపెంచే తల్లితో సమానం; తండ్రివి అంటే కన్నతండ్రివలె రక్షించేవాడివి; నీవే అంటే నువ్వే; నా తోడు అంటే నాకు సహాయకుడివి; నీడ అంటేవెన్నంటి ఉండే నీడ వంటి వాడివి; నీవే అంటే నువ్వే; సఖుడు + ఔ అంటే ప్రాణమిత్రుడివి; నీవే అంటే నువ్వే; గురుడవు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి; దైవము అంటే దేవుడవు; నీవే అంటే నువ్వే; నా పతియు అంటే నాకు ప్రభువు; గతియుఅంటే దిక్కు.
ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు భగవంతుడని, ఆయనే శ్రీకృష్ణుడని కవి ఈ పద్యంలో వివరించాడు. ఇందులో ఉపయోగించిన పదాలన్నీ చాలా చిన్నవి. అతి సులువుగా నేర్చుకోవచ్చు. ఇటువంటి చిన్నచిన్న పద్యాలయితే పిల్లలు చక్కగా పలుకుతారు. పిల్లలకు బాల్యం నుంచే భగవంతుడికి నమస్కరించే అలవాటును ఇటువంటి పద్యాలతో ఆరంభిస్తే వారికి కూడా ఆసక్తి కలుగుతుంది.
కృష్ణా అంటే ఓ కృష్ణా; నిజముగ అంటే వాస్తవంగా; నీవే అంటే నువ్వే; నాకు అంటే నిన్ను పూజించే నాకు; తల్లివి అంటే కనిపెంచే తల్లితో సమానం; తండ్రివి అంటే కన్నతండ్రివలె రక్షించేవాడివి; నీవే అంటే నువ్వే; నా తోడు అంటే నాకు సహాయకుడివి; నీడ అంటేవెన్నంటి ఉండే నీడ వంటి వాడివి; నీవే అంటే నువ్వే; సఖుడు + ఔ అంటే ప్రాణమిత్రుడివి; నీవే అంటే నువ్వే; గురుడవు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి; దైవము అంటే దేవుడవు; నీవే అంటే నువ్వే; నా పతియు అంటే నాకు ప్రభువు; గతియుఅంటే దిక్కు.
ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు భగవంతుడని, ఆయనే శ్రీకృష్ణుడని కవి ఈ పద్యంలో వివరించాడు. ఇందులో ఉపయోగించిన పదాలన్నీ చాలా చిన్నవి. అతి సులువుగా నేర్చుకోవచ్చు. ఇటువంటి చిన్నచిన్న పద్యాలయితే పిల్లలు చక్కగా పలుకుతారు. పిల్లలకు బాల్యం నుంచే భగవంతుడికి నమస్కరించే అలవాటును ఇటువంటి పద్యాలతో ఆరంభిస్తే వారికి కూడా ఆసక్తి కలుగుతుంది.
హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజ నాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
ప్రతిపదార్థం: అంబుజ నాభా అంటే నాభియందు పద్మం ఉన్న ఓ విష్ణుమూర్తీ! (శ్రీ కృష్ణా); హరి + అను అంటే ‘హ’ ‘రి’ అనే రెండు అక్షరాలు; పాతకములను అంటే చేసిన పాపాలను; హరియించును అంటే పోగొడతాయి; హరి అంటే హరి అనెడి; నీ నామమహాత్మ్యము అంటే నీ పేరులో ఉన్న గొప్పదనం; హరిహరి అంటే ఆహా; పొగడంగ అంటే స్తుతించడం; వశమె అంటే సాధ్యమగునా!
భావం: ఓ శ్రీకృష్ణా! ‘హ’ ‘రి’ అనే రెండు అక్షరాలను కలిపి పలికినంత మాత్రానే అంతవరకు చేసిన పాపాలనన్నిటినీ హరిస్తావు. ఓ శ్రీకృష్ణా! నీ పేరులో ఉన్న గొప్పతనాన్ని వర్ణించి చెప్పటం ఎవ్వరితరమూ కాదు కదా!
హరి అనే రెండు అక్షరాలను స్మరించిన ప్రహ్లాదుడు కష్టాలను అధిగమించాడు. శ్రీహరిని ధ్యానించిన గజేంద్రుడు మోక్షం పొందాడు. శ్రీహరికై తపస్సు చేసిన ధ్రువుడు ఆకాశంలో నక్షత్రరూపంలో శాశ్వత స్థానాన్ని పొందాడు. ఇంకా ఎందరో భక్తులు ఆ హరిని ప్రార్థించిమహనీయులు అయ్యారు. హరి అనే రెండు అక్షరాల పదానికి ఇంత మహాత్మ్యం ఉందని కవి ఈ పద్యంలో వివరించాడు.
హరియించును పాతకముల నంబుజ నాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
ప్రతిపదార్థం: అంబుజ నాభా అంటే నాభియందు పద్మం ఉన్న ఓ విష్ణుమూర్తీ! (శ్రీ కృష్ణా); హరి + అను అంటే ‘హ’ ‘రి’ అనే రెండు అక్షరాలు; పాతకములను అంటే చేసిన పాపాలను; హరియించును అంటే పోగొడతాయి; హరి అంటే హరి అనెడి; నీ నామమహాత్మ్యము అంటే నీ పేరులో ఉన్న గొప్పదనం; హరిహరి అంటే ఆహా; పొగడంగ అంటే స్తుతించడం; వశమె అంటే సాధ్యమగునా!
భావం: ఓ శ్రీకృష్ణా! ‘హ’ ‘రి’ అనే రెండు అక్షరాలను కలిపి పలికినంత మాత్రానే అంతవరకు చేసిన పాపాలనన్నిటినీ హరిస్తావు. ఓ శ్రీకృష్ణా! నీ పేరులో ఉన్న గొప్పతనాన్ని వర్ణించి చెప్పటం ఎవ్వరితరమూ కాదు కదా!
హరి అనే రెండు అక్షరాలను స్మరించిన ప్రహ్లాదుడు కష్టాలను అధిగమించాడు. శ్రీహరిని ధ్యానించిన గజేంద్రుడు మోక్షం పొందాడు. శ్రీహరికై తపస్సు చేసిన ధ్రువుడు ఆకాశంలో నక్షత్రరూపంలో శాశ్వత స్థానాన్ని పొందాడు. ఇంకా ఎందరో భక్తులు ఆ హరిని ప్రార్థించిమహనీయులు అయ్యారు. హరి అనే రెండు అక్షరాల పదానికి ఇంత మహాత్మ్యం ఉందని కవి ఈ పద్యంలో వివరించాడు.
చిలుకనొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ మిము దలచు జనుల కరుదా కృష్ణా!
ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; ఒక రమణి అంటే ఒక స్త్రీ; ముద్దులు చిలుకను అంటే అందంగా, ముద్దులొలికేలా; చిలుకన్ అంటే ఒక చిలుకను; శ్రీరామ + అనుచు అంటే శ్రీరామా అని పలికేలా; శ్రీపతి అంటే విష్ణుమూర్తి యొక్క; పేరున్ అంటే పేరును; పిలిచినన్అంటే పలికినంతచేతనే; మోక్షమున్ అంటే మోక్షాన్ని; ఇచ్చితివి అంటే అనుగ్రహించావు; మిమున్ అంటే భగవంతుడవైన నిన్ను; తలచు అంటే స్మరించే; జనులకున్ అంటే మామూలు మనుషులకు లభించటంలో; అరుదా అంటే లభించదా (లభిస్తుంది).
భావం: ఒక స్త్రీ తన పెంపుడు చిలుకకు శ్రీరామా అని విష్ణుమూర్తి పేరును ముద్దుముద్దుగా పలికేలా నేర్పింది. ఆ చిలుకకు అలా నేర్పినంత మాత్రానే ఆమెకు మోక్షం ఇచ్చావు. కనుక నిన్ను నిరంతరం ప్రార్థించేవారికి మోక్షం లభించటం అనేది అరుదుకాదు. అదిచాలా తేలికైన విషయం.
ఎవరి పనులు వారు నిర్వహించుకుంటూ మనసులో భగవంతుడిని ధ్యానించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనే పరమాత్మ అనే దానిని ఒంట బట్టించుకుని పనిలో దేవుడిని చూస్తే అందులో రాణించగలుగుతారు. అంటే ఏ పని చేయాలన్నా మానసికపరిశుభ్రత అవసరం. అలాగే దేవుడిని కేవలం రెండు అక్షరాలతో పలికితేనే చాలు చేసే ప్రతిపనిలో ఆయన తోడు ఉంటాడని కవి ఈ పద్యంలో వివరించాడు.
అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!
భావం: ఓ కృష్ణా! బాల్యంలో నీ కాళ్లకు అందంగా అలంకరించిన అందెలు, గజ్జెలను ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ గంతులేస్తూ, నందుని భార్య అయిన యశోద ఎదుట నిలబడి ఆమెకు ముద్దు కలిగించేలా ఆడుతుంటావు.
ప్రతిపదార్థం: కృష్ణా అంటే శ్రీకృష్ణా; అందెలు అంటే కాలికి అలంకారంగా పెట్టుకునే కడియాల వంటి ఆభరణం; గజ్జెలు అంటే ఘల్లుఘల్లుమని శబ్దం చేసే కాలియందు ధరించిన గ జ్జెలు; మ్రోయగన్ అంటే శబ్దం చేస్తుండగా; చిందులు అంటే కాళ్లతో అస్తవ్యస్తంగా చిందులు; త్రొక్కుచును అంటే వేస్తూ; వేడ్క అంటే ఆనందం; చెలువారంగా అంటే అందం ఎక్కువ అవుతుండగా; నందుని సతి అంటే గోకులంలో ఉండే నందుని భార్య అయిన యశోద; ఆ గోపిక అంటే గోపకాంతకు (తల్లి అయిన యశోదకు); ముందర అంటే ఎదురుగా నిలబడి; మిగుల అంటే ఎక్కువగా; మురియుచు అంటే ఆనందిస్తూ; ఆడుదువు అంటే నాట్యం చేస్తావు.
పసిపిల్లల కాళ్లకు కడియాలు అలంకరించి తల్లి మురిసిపోతుంది. కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని శబ్దం చేస్తూ పిల్లలు నడుస్తూంటే ఆ ఇంటికి కొత్త అందం వస్తుంది. చిన్నికృష్ణుడు యశోదకు ఆనందం కలిగిస్తే, ఇంటింటా బుల్లి కృష్ణులు తల్లులను మురిపిస్తారని కవి ఈపద్యంలో వివరించాడు.
శక్రసుతు గాచుకొఱకై
చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ
విక్రమ మేమని పొగడుదు
నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా!
ప్రతిపదార్థం: నక్రగ్రహ అంటే మొసలిని చంపినట్టి; సర్వలోక అంటే అన్నిలోకాలకు; నాయక అంటే అధిపతివైనట్టి; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; శక్రసుతున్ అంటే ఇంద్రుని కుమారుడైన అర్జునుని; కాచుకొరకై అంటే రక్షించడానికిగాను; చక్రము అంటే సుదర్శన చక్రాన్ని; చేపట్టి అంటే చేతియందు ధరించి; భీష్ము అంటే భీష్మపితామహుడిని; చంపఁగ అంటే సంహరించడానికి; చను అంటే బయలుదేరిన; నీ అంటే నీయొక్క; విక్రమము + ఏమని అంటే పరాక్రమాన్ని ఏ విధంగా;పొగడుదు అంటే పొగడగలను.
భావం: కృష్ణా! అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముని ధాటికి తాళలేకపోతున్న అర్జునుడిని రక్షించడానికి నువ్వు చేతిలో చక్రాయుధాన్ని ధరించి పరాక్రమాన్ని ప్రదర్శించావు. అటువంటి నిన్ను వర్ణించటం ఎవరితరమూ కాదు.
కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోనని చెప్పిన శ్రీకృష్ణుడు తనకు ఇష్టుడైన అర్జునుడిని రక్షించడం కోసమని రథం మీద నుంచి ఒక్క దూకు దూకి చక్రాయుధాన్ని చే తబట్టి భీష్ముడి మీదకు బయలుదేరతాడు. అర్జునుడి మీద ఉన్నప్రేమతో తన మాట తానే మర్చిపోయాడు. కృష్ణునికి అర్జునుడంటే అంత ప్రీతి. ఆ విషయాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.
చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ
విక్రమ మేమని పొగడుదు
నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా!
ప్రతిపదార్థం: నక్రగ్రహ అంటే మొసలిని చంపినట్టి; సర్వలోక అంటే అన్నిలోకాలకు; నాయక అంటే అధిపతివైనట్టి; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; శక్రసుతున్ అంటే ఇంద్రుని కుమారుడైన అర్జునుని; కాచుకొరకై అంటే రక్షించడానికిగాను; చక్రము అంటే సుదర్శన చక్రాన్ని; చేపట్టి అంటే చేతియందు ధరించి; భీష్ము అంటే భీష్మపితామహుడిని; చంపఁగ అంటే సంహరించడానికి; చను అంటే బయలుదేరిన; నీ అంటే నీయొక్క; విక్రమము + ఏమని అంటే పరాక్రమాన్ని ఏ విధంగా;పొగడుదు అంటే పొగడగలను.
భావం: కృష్ణా! అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముని ధాటికి తాళలేకపోతున్న అర్జునుడిని రక్షించడానికి నువ్వు చేతిలో చక్రాయుధాన్ని ధరించి పరాక్రమాన్ని ప్రదర్శించావు. అటువంటి నిన్ను వర్ణించటం ఎవరితరమూ కాదు.
కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోనని చెప్పిన శ్రీకృష్ణుడు తనకు ఇష్టుడైన అర్జునుడిని రక్షించడం కోసమని రథం మీద నుంచి ఒక్క దూకు దూకి చక్రాయుధాన్ని చే తబట్టి భీష్ముడి మీదకు బయలుదేరతాడు. అర్జునుడి మీద ఉన్నప్రేమతో తన మాట తానే మర్చిపోయాడు. కృష్ణునికి అర్జునుడంటే అంత ప్రీతి. ఆ విషయాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.
మగ మీనమువై జలధిని
పగతుని సోమకుని జంపి పద్మ భవునకు
న్నిగమముల దెచ్చి యిచ్చితి
సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా!
భావం: మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన సౌందర్యం కలవాడా! ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చిబ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం.
ప్రతిపదార్థం: సుగుణాకరా అంటే మంచి గుణములకు నెలవైనవాడా; దివ్యసుందర అంటే దైవసంబంధమైన సౌందర్యం కలవాడా; ఓ కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నీవు అంటే నువ్వు; జలధిని అంటే నీటికి నిధి అయిన సముద్రంలో; మగమీనమువై అంటే మగచేపవై(మీనావతారం); పగతుని అంటే శత్రువు అయిన; సోమకుని అంటే వేదాలను దొంగిలించిన సోమకుడనే రాక్షసుడిని; చంపి అంటే వధించి; పద్మభవునకున్ అంటే పద్మమునుండి పుట్టిన బ్రహ్మకు; నిగమములన్ అంటే వేదాలను; తెచ్చి యిచ్చితి అంటేతెచ్చిఇచ్చావు; మేలు అంటే ఎంత ఆశ్చర్యం!
చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు అని కవి ఈ పద్యంలోవివరించాడు.
పగతుని సోమకుని జంపి పద్మ భవునకు
న్నిగమముల దెచ్చి యిచ్చితి
సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా!
భావం: మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన సౌందర్యం కలవాడా! ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చిబ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం.
ప్రతిపదార్థం: సుగుణాకరా అంటే మంచి గుణములకు నెలవైనవాడా; దివ్యసుందర అంటే దైవసంబంధమైన సౌందర్యం కలవాడా; ఓ కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నీవు అంటే నువ్వు; జలధిని అంటే నీటికి నిధి అయిన సముద్రంలో; మగమీనమువై అంటే మగచేపవై(మీనావతారం); పగతుని అంటే శత్రువు అయిన; సోమకుని అంటే వేదాలను దొంగిలించిన సోమకుడనే రాక్షసుడిని; చంపి అంటే వధించి; పద్మభవునకున్ అంటే పద్మమునుండి పుట్టిన బ్రహ్మకు; నిగమములన్ అంటే వేదాలను; తెచ్చి యిచ్చితి అంటేతెచ్చిఇచ్చావు; మేలు అంటే ఎంత ఆశ్చర్యం!
చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు అని కవి ఈ పద్యంలోవివరించాడు.
కుక్షిని నిఖిల జగంబులు
నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్
రక్షక వటపత్రముపై
దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!
ప్రతిపదార్థం: రక్షక అంటే అందరినీ రక్షించే; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; కుక్షిని అంటే నీ పొట్టయందు; నిఖిల అంటే సమస్తమైన; జగంబులను అంటే లోకాలను; నిక్షేపము చేసి అంటే దాచిపెట్టి; ప్రళయ అంటే ప్రళయ సంబంధమైన; నీరధి అంటే సముద్రము యొక్క;నడుమన్ అంటే మధ్యభాగంలో; వటపత్రముపై అంటే మర్రి ఆకు మీద; దక్షతన్ అంటే నేర్పు; పవళించునట్టి అంటే నిద్రిస్తున్న నీవు; ధన్యుడు అంటే గొప్పవాడివి.
భావం: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం!
ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలేగాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.
నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్
రక్షక వటపత్రముపై
దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!
ప్రతిపదార్థం: రక్షక అంటే అందరినీ రక్షించే; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; కుక్షిని అంటే నీ పొట్టయందు; నిఖిల అంటే సమస్తమైన; జగంబులను అంటే లోకాలను; నిక్షేపము చేసి అంటే దాచిపెట్టి; ప్రళయ అంటే ప్రళయ సంబంధమైన; నీరధి అంటే సముద్రము యొక్క;నడుమన్ అంటే మధ్యభాగంలో; వటపత్రముపై అంటే మర్రి ఆకు మీద; దక్షతన్ అంటే నేర్పు; పవళించునట్టి అంటే నిద్రిస్తున్న నీవు; ధన్యుడు అంటే గొప్పవాడివి.
భావం: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం!
ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలేగాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.
ఆదివరాహుడవయి నీ
వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్
మోదమున సురలు పొగడఁగ
మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా!
భావం: మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు.
ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ కృష్ణా; నీవు అంటే నువ్వు; ఆదివరాహుడవు అంటే విష్ణుమూర్తి అవతారంగా వరాహ రూపం ధరించి; ఆ దనుజున్ అంటే రాక్షసుడయినటువంటి ఆ; హిరణ్యనేత్రున్ అంటే హిరణ్యాక్షుడిని; హతున్ అంటే చంపి; తగన్ అంటే ఒప్పుగా; మోదమునన్ అంటే సంతోషంతో; సురలు అంటే దేవతలు; పొగడగన్ అంటే ప్రశంసించగా; మేదినిన్ అంటే భూమిని; గొడుగున్ + ఎత్తి అంటే గొడుగులాగ పెకైత్తి; మెరసితి అంటే ప్రకాశించావు. సకలజీవరాసులూ నివసించటానికి అనువైన భూమి నీటిలో మునిగిఉన్నందున, దానిని పైకి తీసుకురమ్మని తండ్రి అయిన బ్రహ్మను ప్రార్థిస్తాడు మనువు.
ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు. ఆ వరాహం సముద్రంలోకి ప్రవేశించి వాసనద్వారా భూమిని వెతికింది. భూమి పాతాళంలో కనిపించింది. అప్పుడు ఆ ధరణిని వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు అడ్డు తగిలాడు. హిరణ్యాక్షుడి (హిరణ్యాక్షుడు అంటే సంపదమీద కన్ను వేసినవాడుఅని అర్థం) తో యుద్ధం చేసి సముద్రంలోనే వాడిని చంపి భూమిని నీటి పైకి తీసుకువచ్చాడని వరాహావతారాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.
వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్
మోదమున సురలు పొగడఁగ
మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా!
భావం: మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు.
ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ కృష్ణా; నీవు అంటే నువ్వు; ఆదివరాహుడవు అంటే విష్ణుమూర్తి అవతారంగా వరాహ రూపం ధరించి; ఆ దనుజున్ అంటే రాక్షసుడయినటువంటి ఆ; హిరణ్యనేత్రున్ అంటే హిరణ్యాక్షుడిని; హతున్ అంటే చంపి; తగన్ అంటే ఒప్పుగా; మోదమునన్ అంటే సంతోషంతో; సురలు అంటే దేవతలు; పొగడగన్ అంటే ప్రశంసించగా; మేదినిన్ అంటే భూమిని; గొడుగున్ + ఎత్తి అంటే గొడుగులాగ పెకైత్తి; మెరసితి అంటే ప్రకాశించావు. సకలజీవరాసులూ నివసించటానికి అనువైన భూమి నీటిలో మునిగిఉన్నందున, దానిని పైకి తీసుకురమ్మని తండ్రి అయిన బ్రహ్మను ప్రార్థిస్తాడు మనువు.
ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు. ఆ వరాహం సముద్రంలోకి ప్రవేశించి వాసనద్వారా భూమిని వెతికింది. భూమి పాతాళంలో కనిపించింది. అప్పుడు ఆ ధరణిని వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు అడ్డు తగిలాడు. హిరణ్యాక్షుడి (హిరణ్యాక్షుడు అంటే సంపదమీద కన్ను వేసినవాడుఅని అర్థం) తో యుద్ధం చేసి సముద్రంలోనే వాడిని చంపి భూమిని నీటి పైకి తీసుకువచ్చాడని వరాహావతారాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.
అందఱు సురలును దనుజులు
పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా
నందముగ కూర్మరూపున
మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా!
ప్రతిపదార్థం: మాధవా! అంటే మౌనం, ధ్యానం, యోగం అనే మూడు మార్గాలద్వారా భక్తులను అనుగ్రహించేవాడా లేదా లక్ష్మీదేవి భర్తయైనవాడా; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; సురలును అంటే దేవతలు; దనుజులు అంటే రాక్షసులు; అందరు అంటే వీరందరూ; పొందుగఅంటే ఒకరితో ఒకరు కలిసి; క్షీర + అబ్ధిన్ అంటే అంటే పాలసముద్రాన్ని; తఱవన్ అంటే కవ్వంతో చిలుకగాచిలుకగా;పొలుపునన్ అంటే నేర్పుతో; నీవు + ఆనందముగ అంటే సంతోషం కలిగేటట్లు నువ్వు; కూర్మరూపునన్ అంటే తాబేలు ఆకారంలో; మందరగిరి అంటేకవ్వంగా ఉన్న మందరగిరి అనే పేరుగల పర్వతాన్ని; ఎత్తితివి + ఔర అంటే పైకి ఎత్తటం ఎంత ఆశ్చర్యం!
భావం: లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం.
విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతోసముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు.
పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా
నందముగ కూర్మరూపున
మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా!
ప్రతిపదార్థం: మాధవా! అంటే మౌనం, ధ్యానం, యోగం అనే మూడు మార్గాలద్వారా భక్తులను అనుగ్రహించేవాడా లేదా లక్ష్మీదేవి భర్తయైనవాడా; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; సురలును అంటే దేవతలు; దనుజులు అంటే రాక్షసులు; అందరు అంటే వీరందరూ; పొందుగఅంటే ఒకరితో ఒకరు కలిసి; క్షీర + అబ్ధిన్ అంటే అంటే పాలసముద్రాన్ని; తఱవన్ అంటే కవ్వంతో చిలుకగాచిలుకగా;పొలుపునన్ అంటే నేర్పుతో; నీవు + ఆనందముగ అంటే సంతోషం కలిగేటట్లు నువ్వు; కూర్మరూపునన్ అంటే తాబేలు ఆకారంలో; మందరగిరి అంటేకవ్వంగా ఉన్న మందరగిరి అనే పేరుగల పర్వతాన్ని; ఎత్తితివి + ఔర అంటే పైకి ఎత్తటం ఎంత ఆశ్చర్యం!
భావం: లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం.
విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతోసముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు.
కెరలి యఱచేత కంబము
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్
ఉదరము జీరి వధించితివి
నరహరి రూపావతార నగధర కృష్ణా!
నరహరి అంటే మనిషి, సింహం; రూప + అవతార అంటే రూపంలో అవతరించినవాడా; నగధర అంటే కొండను ధరించువాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; కెరలి అంటే క్రోధంతో; అఱచేతను అంటే అరచేతితో; కంబమున్ అంటే స్తంభాన్ని; అరుదుగ అంటే ఎప్పుడూ లేనట్లుగా; వేయుటకు అంటే కొట్టటం చేత; వెడలి అంటే ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి; ఆ + అసుర + ఈశ్వరునిన్ అంటే ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుని; ఉదరము అంటే వక్షస్థలాన్ని; చీరి అంటే రెండుగా చీల్చి; వధించితివి అంటే చంపావు.
భావం: కొండను ధరించిన వాడవైన ఓ కృష్ణా! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో కోపంగా... ఈ స్తంభంలో విష్ణువుని చూపుతావా అంటూ ఉక్కు స్తంభాన్ని అరచేతితో గట్టిగా చరచగా నువ్వు నరసింహావతారం ధరించి, ఆ స్తంభంలోనుంచి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపావు.
హిరణ్యకశిపుడు తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. ఇంటిలోపల బయట... పగలురాత్రి... మనుషులుజంతువులు... ఇలా ఎన్నో వాటి కారణంగా మరణం లేని వరాన్ని పొందాడు. అందువల్ల విష్ణుమూర్తి పగలు రాత్రి కాని మధ్యాహ్న సమయంలో, ఇంటిలోపల బయట కాని గడపమీద, మనిషిజంతువు కాని నరసింహాకారంలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని వధించాడు. నరసింహావతారం గురించి కవి ఈ పద్యంలో వివరించాడు.
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్
ఉదరము జీరి వధించితివి
నరహరి రూపావతార నగధర కృష్ణా!
నరహరి అంటే మనిషి, సింహం; రూప + అవతార అంటే రూపంలో అవతరించినవాడా; నగధర అంటే కొండను ధరించువాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; కెరలి అంటే క్రోధంతో; అఱచేతను అంటే అరచేతితో; కంబమున్ అంటే స్తంభాన్ని; అరుదుగ అంటే ఎప్పుడూ లేనట్లుగా; వేయుటకు అంటే కొట్టటం చేత; వెడలి అంటే ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి; ఆ + అసుర + ఈశ్వరునిన్ అంటే ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుని; ఉదరము అంటే వక్షస్థలాన్ని; చీరి అంటే రెండుగా చీల్చి; వధించితివి అంటే చంపావు.
భావం: కొండను ధరించిన వాడవైన ఓ కృష్ణా! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో కోపంగా... ఈ స్తంభంలో విష్ణువుని చూపుతావా అంటూ ఉక్కు స్తంభాన్ని అరచేతితో గట్టిగా చరచగా నువ్వు నరసింహావతారం ధరించి, ఆ స్తంభంలోనుంచి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపావు.
హిరణ్యకశిపుడు తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. ఇంటిలోపల బయట... పగలురాత్రి... మనుషులుజంతువులు... ఇలా ఎన్నో వాటి కారణంగా మరణం లేని వరాన్ని పొందాడు. అందువల్ల విష్ణుమూర్తి పగలు రాత్రి కాని మధ్యాహ్న సమయంలో, ఇంటిలోపల బయట కాని గడపమీద, మనిషిజంతువు కాని నరసింహాకారంలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని వధించాడు. నరసింహావతారం గురించి కవి ఈ పద్యంలో వివరించాడు.
వడుగుడవై మూడడుగుల
నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్
తొడిగితివి నీదు మేనునన్
గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!
కృష్ణా అంటే ఓ కృష్ణా నీవు; వడుగుడవై అంటే బ్రహ్మచారివై; మూడు + అడుగులన్ అంటే మూడు పాదములు మోపునంత స్థలాన్ని; అడిగితివి అంటే కోరుకున్నావు; నీదు అంటే నీయొక్క; మేనునన్ అంటే శరీరంలో; అఖిల అంటే సమస్తమైన; జగంబుల్ అంటేలోకాలను; తొడిగితివి అంటే ఆక్రమించావు; (అన్ని లోకాలను ఆక్రమించావు) ఔను అంటే వాస్తవము; భళిర భళిర అంటే ఆహా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం; నీ చరిత్ర అంటే నీ గొప్పదనాన్ని చెప్పే కథ; కడు చిత్రము అంటే చాలా చిత్రమైనది; ఘనము + అవు అంటే గొప్పది అగును కదా!
ఓ శ్రీకృష్ణా! వామనుడిగా మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి, రెండు అడుగులతో సమస్త లోకాలనూ ఆక్రమించిన నీ చరిత్ర చాలా గొప్పది, ఆశ్చర్యాన్ని కలిగించేదీనూ.
వామనావతారంలో విష్ణుమూర్తి బహ్మచారిగా సాక్షాత్కరించి, రాక్షస రాజైన బలిచక్రవర్తి నుంచి మూడడుగుల దానం స్వీకరించబోగా, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని రాక్షసగురువు శుక్రాచార్యుడు చెప్పినప్పటికీ, వినకుండా బలిచక్రవర్తి దానం చేస్తాడు. రెండడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడిగినప్పుడు, తన తల మీద ఉంచమని చెప్పిగా బలిని పాతాళానికి పంపాడు. కవి ఈ పద్యంలో వామనావతారాన్ని వివరించాడు.
నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్
తొడిగితివి నీదు మేనునన్
గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!
కృష్ణా అంటే ఓ కృష్ణా నీవు; వడుగుడవై అంటే బ్రహ్మచారివై; మూడు + అడుగులన్ అంటే మూడు పాదములు మోపునంత స్థలాన్ని; అడిగితివి అంటే కోరుకున్నావు; నీదు అంటే నీయొక్క; మేనునన్ అంటే శరీరంలో; అఖిల అంటే సమస్తమైన; జగంబుల్ అంటేలోకాలను; తొడిగితివి అంటే ఆక్రమించావు; (అన్ని లోకాలను ఆక్రమించావు) ఔను అంటే వాస్తవము; భళిర భళిర అంటే ఆహా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం; నీ చరిత్ర అంటే నీ గొప్పదనాన్ని చెప్పే కథ; కడు చిత్రము అంటే చాలా చిత్రమైనది; ఘనము + అవు అంటే గొప్పది అగును కదా!
ఓ శ్రీకృష్ణా! వామనుడిగా మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి, రెండు అడుగులతో సమస్త లోకాలనూ ఆక్రమించిన నీ చరిత్ర చాలా గొప్పది, ఆశ్చర్యాన్ని కలిగించేదీనూ.
వామనావతారంలో విష్ణుమూర్తి బహ్మచారిగా సాక్షాత్కరించి, రాక్షస రాజైన బలిచక్రవర్తి నుంచి మూడడుగుల దానం స్వీకరించబోగా, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని రాక్షసగురువు శుక్రాచార్యుడు చెప్పినప్పటికీ, వినకుండా బలిచక్రవర్తి దానం చేస్తాడు. రెండడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడిగినప్పుడు, తన తల మీద ఉంచమని చెప్పిగా బలిని పాతాళానికి పంపాడు. కవి ఈ పద్యంలో వామనావతారాన్ని వివరించాడు.
ఇరువదొకమారు నృపతుల
శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్
ధర గశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామ భద్రుఁడు కృష్ణా!
భావం: ఓ కృష్ణా! నువ్వు జమదగ్ని ఋషికి కుమారునిగా పరశురామావతారం దాల్చి రాజులందరినీ ఇరువదియొక్కమార్లు ఖండించావు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి అందచేసి గొప్పవానిగా ప్రవర్తించావు.
జమదగ్ని అంటే జమదగ్ని అనే పేరు గల ఋషి యొక్క; రామభద్రుడు అంటే కుమారుడవైన రామభద్రా (పరశురామా); నీవు అంటే నువ్వు; ఇరువది + ఒక్కమారు అంటే ఇరవై ఒక్కసార్లు; నృపతుల అంటే రాజులయొక్క, శిరములు అంటే తలలను, చే గొడ్డంటన్అంటే చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో; ఖండించితివి అంటే నరికేశావు; ధరన్ అంటే భూమిని; కశ్యపునకున్ అంటే కశ్యపుడనే పేరు గల మహామునికి; ఇచ్చి అంటే అందచేసి; పరగవే అంటే ప్రవర్తింపవా!
సప్తఋషులలో జమదగ్ని ఒకరు. ఆయన కుమారుడు పరశురాముడు. విష్ణుమూర్తి అవతారాలలో నరసింహావతారం తరవాత అంత క్రోధాన్ని ప్రదర్శించిన అవతారం ఇదే. తండ్రి కోరిక మేరకు తల్లి అయిన రేణుక శిరసు ఖండించి తండ్రికి ఇష్టుడయ్యాడు. ఏదైనావరం కోరుకోమని తండ్రి అడుగగా, తల్లిని బతికించమని కోరాడు. కవి ఈ పద్యంలో పరశురామావతారాన్ని వర్ణించాడు.
శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్
ధర గశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామ భద్రుఁడు కృష్ణా!
భావం: ఓ కృష్ణా! నువ్వు జమదగ్ని ఋషికి కుమారునిగా పరశురామావతారం దాల్చి రాజులందరినీ ఇరువదియొక్కమార్లు ఖండించావు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి అందచేసి గొప్పవానిగా ప్రవర్తించావు.
జమదగ్ని అంటే జమదగ్ని అనే పేరు గల ఋషి యొక్క; రామభద్రుడు అంటే కుమారుడవైన రామభద్రా (పరశురామా); నీవు అంటే నువ్వు; ఇరువది + ఒక్కమారు అంటే ఇరవై ఒక్కసార్లు; నృపతుల అంటే రాజులయొక్క, శిరములు అంటే తలలను, చే గొడ్డంటన్అంటే చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో; ఖండించితివి అంటే నరికేశావు; ధరన్ అంటే భూమిని; కశ్యపునకున్ అంటే కశ్యపుడనే పేరు గల మహామునికి; ఇచ్చి అంటే అందచేసి; పరగవే అంటే ప్రవర్తింపవా!
సప్తఋషులలో జమదగ్ని ఒకరు. ఆయన కుమారుడు పరశురాముడు. విష్ణుమూర్తి అవతారాలలో నరసింహావతారం తరవాత అంత క్రోధాన్ని ప్రదర్శించిన అవతారం ఇదే. తండ్రి కోరిక మేరకు తల్లి అయిన రేణుక శిరసు ఖండించి తండ్రికి ఇష్టుడయ్యాడు. ఏదైనావరం కోరుకోమని తండ్రి అడుగగా, తల్లిని బతికించమని కోరాడు. కవి ఈ పద్యంలో పరశురామావతారాన్ని వర్ణించాడు.
దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చికొనియు నయోధ్య
న్విశదముగ కీర్తి నేలితి
దశరథరామావతార ధన్యుడ కృష్ణా!
భావం: ఓ కృష్ణా! నువ్వు దశరథునికి కుమారుడిగా జన్మించావు. రామావతారం ఎత్తావు. పది తలల రావణుని చంపావు. సీతాదేవితో క్షేమంగా అయోధ్యానగరానికి వ చ్చావు. మంచి పేరుప్రఖ్యాతులు వచ్చేలా రాజ్యాన్ని పరిపాలించావు.
ప్రతిపదార్థం: దశరథరామ + అవతార అంటే దశరథ మహారాజుకి పుట్టి రాముడిగా ప్రసిద్ధుడైనవాడా; ధన్యుడ అంటే ధన్యమైన జీవితం కలవాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; దశకంఠుని అంటే పదితలలు గల రావణుడిని; పరిమార్చియు అంటే చంపి; కుశలముతో అంటే క్షేమముగా; సీతన్ అంటే నీ భార్య అయిన జానకీదేవిని; తెచ్చుకొనియు అంటే లంక నుంచి తీసుకొనివచ్చి; అయోధ్యన్ అంటే అయోధ్యానగరాన్ని; విశదముగ అంటే గొప్పదైన; కీర్తిన్ అంటే ఖ్యాతితో; ఏలితి అంటేపరిపాలించావు.
విష్ణుమూర్తి అవతారాలలో రామావతారం చాలా గొప్పది. తండ్రిమాటను జవదాటని వాడు రాముడు. నిజమే తప్ప అబద్ధం పలకడం తెలియని వాడు రాముడు. తండ్రి అయిన దశరథుడు కైకకు ఇచ్చిన మాట నిలబెట్టడానికి 14 సంవత్సరాలుఅడవికి వెళ్లినవాడు రాముడు. రాముడంటే... ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య...గా ప్రసిద్ధికెక్కాడు. అందుకే రాముడిని ‘లంకేశుని వైరి వంటి రాజు’ అన్నారు. కవి ఈ పద్యంలో రామావతారాన్ని వర్ణించాడు.
కుశలముతో సీత దెచ్చికొనియు నయోధ్య
న్విశదముగ కీర్తి నేలితి
దశరథరామావతార ధన్యుడ కృష్ణా!
భావం: ఓ కృష్ణా! నువ్వు దశరథునికి కుమారుడిగా జన్మించావు. రామావతారం ఎత్తావు. పది తలల రావణుని చంపావు. సీతాదేవితో క్షేమంగా అయోధ్యానగరానికి వ చ్చావు. మంచి పేరుప్రఖ్యాతులు వచ్చేలా రాజ్యాన్ని పరిపాలించావు.
ప్రతిపదార్థం: దశరథరామ + అవతార అంటే దశరథ మహారాజుకి పుట్టి రాముడిగా ప్రసిద్ధుడైనవాడా; ధన్యుడ అంటే ధన్యమైన జీవితం కలవాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; దశకంఠుని అంటే పదితలలు గల రావణుడిని; పరిమార్చియు అంటే చంపి; కుశలముతో అంటే క్షేమముగా; సీతన్ అంటే నీ భార్య అయిన జానకీదేవిని; తెచ్చుకొనియు అంటే లంక నుంచి తీసుకొనివచ్చి; అయోధ్యన్ అంటే అయోధ్యానగరాన్ని; విశదముగ అంటే గొప్పదైన; కీర్తిన్ అంటే ఖ్యాతితో; ఏలితి అంటేపరిపాలించావు.
విష్ణుమూర్తి అవతారాలలో రామావతారం చాలా గొప్పది. తండ్రిమాటను జవదాటని వాడు రాముడు. నిజమే తప్ప అబద్ధం పలకడం తెలియని వాడు రాముడు. తండ్రి అయిన దశరథుడు కైకకు ఇచ్చిన మాట నిలబెట్టడానికి 14 సంవత్సరాలుఅడవికి వెళ్లినవాడు రాముడు. రాముడంటే... ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య...గా ప్రసిద్ధికెక్కాడు. అందుకే రాముడిని ‘లంకేశుని వైరి వంటి రాజు’ అన్నారు. కవి ఈ పద్యంలో రామావతారాన్ని వర్ణించాడు.
త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్
కపటపు రాజవు భళిరే
కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!
ప్రతిపదార్థం: కృపగల అంటే దయాగుణం వలన; బౌద్ధావతారం అంటే బుద్ధమూర్తివైనవాడా; ఘనుడవు అంటే గొప్పవాడివి; కృష్ణా అంటే ఓ కృష్ణా; త్రిపుర + అసుర అంటే త్రిపుర రాక్షసుల యొక్క; భార్యలను అంటే సతులను; నిపుణతతో అంటే చాకచక్యంగా; వ్రతముచేత అంటే నియమానుసారం వ్రతం ఆచరించటం చేత; కీర్తుల్ అంటే పేరుప్రఖ్యాతులను; నిలిపిన అంటే నిలబెట్టిన; కపటపు అంటే కపటమైన; రాజువు అంటే పాలకుడివి అయితివి; భళిరే అంటే నిన్ను మెచ్చుకోవచ్చును.
భావం: ఓ కృష్ణా! నువ్వు బౌద్ధావతారం ఎత్తావు. త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు. నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి.
నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్
కపటపు రాజవు భళిరే
కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!
ప్రతిపదార్థం: కృపగల అంటే దయాగుణం వలన; బౌద్ధావతారం అంటే బుద్ధమూర్తివైనవాడా; ఘనుడవు అంటే గొప్పవాడివి; కృష్ణా అంటే ఓ కృష్ణా; త్రిపుర + అసుర అంటే త్రిపుర రాక్షసుల యొక్క; భార్యలను అంటే సతులను; నిపుణతతో అంటే చాకచక్యంగా; వ్రతముచేత అంటే నియమానుసారం వ్రతం ఆచరించటం చేత; కీర్తుల్ అంటే పేరుప్రఖ్యాతులను; నిలిపిన అంటే నిలబెట్టిన; కపటపు అంటే కపటమైన; రాజువు అంటే పాలకుడివి అయితివి; భళిరే అంటే నిన్ను మెచ్చుకోవచ్చును.
భావం: ఓ కృష్ణా! నువ్వు బౌద్ధావతారం ఎత్తావు. త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు. నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి.
ఘనులగు ధేనుక ముష్టిక
దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ రేవతీపతి
యనగ బలరామమూర్తి వైతివి కృష్ణా!
ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ కృష్ణా; తగన్ అంటే తగినవిధంగా; భుజశక్తిన్ అంటే బాహుబలంచేత; ఘనులు + అగు అంటే అంటే గొప్పవారిగా పేరుపొందిన ; ధేనుక ముష్టిక అంటే ధేనుకుడు, ముష్టికుడు అనే పేర్లు గల; దనుజులన్ అంటే రాక్షసులను; చెండాడితివిఅంటే చంపావు; ఔరా అంటే ఆహా; అనఘ + ఆత్మ అంటే పాపము లేని మనసు కలవాడా; రేవతీపతి + అనగ అంటే రేవతీదేవి భర్తగా పిలువబడి; బలరామమూర్తివి అంటే బలరామావతారం; అయితివి అంటే ధరించావు.
భావం: భావం. ఓ కృష్ణా! కేవలం గొప్ప భుజబలం చేత ధేనుక, ముష్టిక అనే పేర్లుగల రాక్షసులను చంపావు. రేవతీదేవి భర్తగా పేరు పొందావు. బలరామ అవతారాన్ని ధరించిన నువ్వు మహానుభావుడివి.
నాగలిని ఆయుధంగా కలిగి ఉన్నవాడు బలరాముడు. శ్రీకృష్ణుని సోదరుడే అయినప్పటికీ బలరాముడికి దుర్యోధనుడ ంటే ఇష్టం ఎక్కువ. ఒకసారి కోపం వచ్చి భూమిని ఒకవైపు ఎత్తాడు. ఆ ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటున్నాం. కవి ఈ పద్యంలోబలరామావతారాన్ని వర్ణించాడు.
దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్
అనఘాత్మ రేవతీపతి
యనగ బలరామమూర్తి వైతివి కృష్ణా!
ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ కృష్ణా; తగన్ అంటే తగినవిధంగా; భుజశక్తిన్ అంటే బాహుబలంచేత; ఘనులు + అగు అంటే అంటే గొప్పవారిగా పేరుపొందిన ; ధేనుక ముష్టిక అంటే ధేనుకుడు, ముష్టికుడు అనే పేర్లు గల; దనుజులన్ అంటే రాక్షసులను; చెండాడితివిఅంటే చంపావు; ఔరా అంటే ఆహా; అనఘ + ఆత్మ అంటే పాపము లేని మనసు కలవాడా; రేవతీపతి + అనగ అంటే రేవతీదేవి భర్తగా పిలువబడి; బలరామమూర్తివి అంటే బలరామావతారం; అయితివి అంటే ధరించావు.
భావం: భావం. ఓ కృష్ణా! కేవలం గొప్ప భుజబలం చేత ధేనుక, ముష్టిక అనే పేర్లుగల రాక్షసులను చంపావు. రేవతీదేవి భర్తగా పేరు పొందావు. బలరామ అవతారాన్ని ధరించిన నువ్వు మహానుభావుడివి.
నాగలిని ఆయుధంగా కలిగి ఉన్నవాడు బలరాముడు. శ్రీకృష్ణుని సోదరుడే అయినప్పటికీ బలరాముడికి దుర్యోధనుడ ంటే ఇష్టం ఎక్కువ. ఒకసారి కోపం వచ్చి భూమిని ఒకవైపు ఎత్తాడు. ఆ ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటున్నాం. కవి ఈ పద్యంలోబలరామావతారాన్ని వర్ణించాడు.
వలపుల తేజీనెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్
కలియుగము తుదిని వేడుక
కలికివిగానున్న లోకకర్తవు కృష్ణా!
ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నువ్వు; వలపు తేజీని అంటే ఆనందాన్ని కలిగించే గుర్రాన్ని; ఎక్కి అంటే అధిరోహించి; ఇలపై అంటే ఈ భూమి మీద; ధర్మమును అంటే వేదాలు చెప్పిన మంచి మార్గాన్ని బోధించే ధర్మాన్ని నిలబెట్టడానికి; హీనులన్ అంటే చెడుస్వభావం కలవారిని; తునుమన్ అంటే చంపటానికి; కలియుగము తుదిన అంటే యుగాలలో నాలుగవది అయిన కలియుగం అంతమయ్యే సమయంలో; వేడుకన్ అంటే వినోదంగా; కలికివిగా + ఉన్న అంటే కలికి అవతారంగా ఉండి; లోకకర్తవు అంటే లోకాలనుసృష్టించేవాడివి.
భావం: భూలోకంలో వింతను, ఆకర్షణను కలిగించే గుర్రాన్ని ఎక్కావు. దుష్టులను సంహరించావు. ధర్మాన్ని నిలబెట్టటానికి కలియుగం ముగిసే సమయంలో కలిపురుషుడిగా అవతరించి, లోకాలు సృష్టించినవాడవు నువ్వు.
నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్
కలియుగము తుదిని వేడుక
కలికివిగానున్న లోకకర్తవు కృష్ణా!
ప్రతిపదార్థం: కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నువ్వు; వలపు తేజీని అంటే ఆనందాన్ని కలిగించే గుర్రాన్ని; ఎక్కి అంటే అధిరోహించి; ఇలపై అంటే ఈ భూమి మీద; ధర్మమును అంటే వేదాలు చెప్పిన మంచి మార్గాన్ని బోధించే ధర్మాన్ని నిలబెట్టడానికి; హీనులన్ అంటే చెడుస్వభావం కలవారిని; తునుమన్ అంటే చంపటానికి; కలియుగము తుదిన అంటే యుగాలలో నాలుగవది అయిన కలియుగం అంతమయ్యే సమయంలో; వేడుకన్ అంటే వినోదంగా; కలికివిగా + ఉన్న అంటే కలికి అవతారంగా ఉండి; లోకకర్తవు అంటే లోకాలనుసృష్టించేవాడివి.
భావం: భూలోకంలో వింతను, ఆకర్షణను కలిగించే గుర్రాన్ని ఎక్కావు. దుష్టులను సంహరించావు. ధర్మాన్ని నిలబెట్టటానికి కలియుగం ముగిసే సమయంలో కలిపురుషుడిగా అవతరించి, లోకాలు సృష్టించినవాడవు నువ్వు.
హరి నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్
బరమేష్ఠి సురలు బొగడగ
కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్
బరమేష్ఠి సురలు బొగడగ
కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!
ప్రతిపదార్థం; హరి అంటే పాపాలను హరించువాడా; నాకును అంటే నాకు; నీవె అంటే నువ్వు మాత్రమే; దిక్కు అంటే అండ అవుతున్నావు; సిరితోన్ అంటే లక్ష్మీదేవితో; ఏతెంచి అంటే కలసివచ్చి; మకరిన్ అంటే మొసలిని; శిక్షించి అంటే వధించి; పరమేష్ఠి అంటేబ్రహ్మ మొదలుగా; సురలు అంటే దేవతలు; పొగడగా అంటే కీర్తించగా; దయన్ అంటే కరుణతో; కరిన్ అంటే ఏనుగును; కాచినరీతి అంటే రక్షించిన విధంగా; నన్నున్ అంటే నన్ను కూడా; కావుము అంటే రక్షించుము.
భావం; కృష్ణా! నువ్వు లక్ష్మీదేవితో కూడివచ్చి బ్రహ్మాది దేవతలు పొగిడేలా... మొసలిని చంపి దయతో ఏ విధంగా ఏనుగును కాపాడావో, నన్ను కూడా అదేవిధంగా రక్షించు. నాకు నీవే శరణు అవుతున్నావు.
ఏనుగుకి, మొసలికి జరిగిన భయంకర యుద్ధంలో ఏనుగు బలం తగ్గిపోవడం మొదలయ్యింది. ఆ సమయంలో ఏనుగు తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉన్నవాడు అలాగే వచ్చి ఏనుగును రక్షించాడు. తనను కూడాఅదేవిధంగా రక్షించమని కవి ఈ పద్యంలో విన్నవించుకున్నాడు.
భావం; కృష్ణా! నువ్వు లక్ష్మీదేవితో కూడివచ్చి బ్రహ్మాది దేవతలు పొగిడేలా... మొసలిని చంపి దయతో ఏ విధంగా ఏనుగును కాపాడావో, నన్ను కూడా అదేవిధంగా రక్షించు. నాకు నీవే శరణు అవుతున్నావు.
ఏనుగుకి, మొసలికి జరిగిన భయంకర యుద్ధంలో ఏనుగు బలం తగ్గిపోవడం మొదలయ్యింది. ఆ సమయంలో ఏనుగు తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉన్నవాడు అలాగే వచ్చి ఏనుగును రక్షించాడు. తనను కూడాఅదేవిధంగా రక్షించమని కవి ఈ పద్యంలో విన్నవించుకున్నాడు.
గోపాల దొంగ మురహర
పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే
గోపాలమూర్తి దయతో
నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!
భావం: ఓ శ్రీకృష్ణా! నువ్వు స్వర్గలోకాన్ని పరిపాలించావు. లీలామానుష రూపుడివి. మురుడు అనే రాక్షసుడిని చంపినవాడివి. పాపాలను పోగొట్టే రాజువి. అన్నీ నువ్వే. నేను నిన్నే నమ్మాను. నువ్వు నాయందు దయ ఉంచి నన్ను రక్షించు అని కవి ఈ పద్యంలోవివరించాడు.
ప్రతిపదార్థం: గో అంటే స్వర్గలోకాన్ని; పాల అంటే పరిపాలించినవాడా; దొంగ అంటే లీలామానుషుడివి అయినవాడా; మురహర అంటే మురుడు అనే పేరుగల రాక్షసుడిని చంపినవాడా; గోపాల అంటే గొల్లపిల్లవాని; మూర్తి అంటే ఆకారం కలిగినవాడా; కృష్ణా అంటే ఓకృష్ణా; పాపాలను అంటే తప్పు పనులు చేయడం వలన వచ్చే ఫలితాన్ని; పారద్రోలు అంటే పోగొట్టగల; ప్రభుడవు అంటే రాజువు; నీవే అంటే నువ్వే; నిశ్చయము అంటే ఇది నిజమని; నమ్మితి అంటే నమ్మాను; నా పాలిట + కలిగి అంటే నాయందు దయ కలిగి; బ్రోవుము అంటే రక్షించుము.
పాపాలను పారఁద్రోలు ప్రభుఁడవు నీవే
గోపాలమూర్తి దయతో
నా పాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా!
భావం: ఓ శ్రీకృష్ణా! నువ్వు స్వర్గలోకాన్ని పరిపాలించావు. లీలామానుష రూపుడివి. మురుడు అనే రాక్షసుడిని చంపినవాడివి. పాపాలను పోగొట్టే రాజువి. అన్నీ నువ్వే. నేను నిన్నే నమ్మాను. నువ్వు నాయందు దయ ఉంచి నన్ను రక్షించు అని కవి ఈ పద్యంలోవివరించాడు.
ప్రతిపదార్థం: గో అంటే స్వర్గలోకాన్ని; పాల అంటే పరిపాలించినవాడా; దొంగ అంటే లీలామానుషుడివి అయినవాడా; మురహర అంటే మురుడు అనే పేరుగల రాక్షసుడిని చంపినవాడా; గోపాల అంటే గొల్లపిల్లవాని; మూర్తి అంటే ఆకారం కలిగినవాడా; కృష్ణా అంటే ఓకృష్ణా; పాపాలను అంటే తప్పు పనులు చేయడం వలన వచ్చే ఫలితాన్ని; పారద్రోలు అంటే పోగొట్టగల; ప్రభుడవు అంటే రాజువు; నీవే అంటే నువ్వే; నిశ్చయము అంటే ఇది నిజమని; నమ్మితి అంటే నమ్మాను; నా పాలిట + కలిగి అంటే నాయందు దయ కలిగి; బ్రోవుము అంటే రక్షించుము.
పాలను వెన్నయు మ్రుచ్చిల
రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్
లీలావినోదివైతివి
బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణా!
భావం: ఓ కృష్ణా! నువ్వు నీ ఇంట్లోవే కాక ఇరుగుపొరుగు ఇళ్లనుంచి కూడా పాలువెన్నలను దొంగిలించావు. అందుకు నీ తల్లికి కోపం వచ్చి నిన్ను తాడుతో రోలుకి కట్టింది. దానిని నువ్వు ఒక లీలావినోదంగా చూశావు. నువ్వు బ్రహ్మదేవుడికి జన్మనిచ్చినదేవదేవుడివి. అంతేకాని నువ్వు పసిపిల్లవాడివి మాత్రం కావు.
ప్రతిపదార్థం: పాలను అంటే క్షీరాన్ని; వెన్నయు అంటే వెన్నను; మ్రుచ్చిలన్ అంటే దొంగిలించగా; రోషముతోడన్ అంటే కోపంతో; నీ తల్లి అంటే నీ తల్లి అయిన యశోద; రోలను అంటే రోటికి; కట్టన్ అంటే తాడుతో బంధించగా; లీలావినోదివి + ఐతివి అంటే ఆటలలోకలిగే సంతోషాన్ని అనుభవించావు; బాలుడవా అంటే నువ్వు సామాన్య పసిబాలుడివా; బ్రహ్మగన్న అంటే బ్రహ్మదేవుని ప్రభవించిన; ప్రభుడవు అంటే గొప్పవాడివి.
రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్
లీలావినోదివైతివి
బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణా!
భావం: ఓ కృష్ణా! నువ్వు నీ ఇంట్లోవే కాక ఇరుగుపొరుగు ఇళ్లనుంచి కూడా పాలువెన్నలను దొంగిలించావు. అందుకు నీ తల్లికి కోపం వచ్చి నిన్ను తాడుతో రోలుకి కట్టింది. దానిని నువ్వు ఒక లీలావినోదంగా చూశావు. నువ్వు బ్రహ్మదేవుడికి జన్మనిచ్చినదేవదేవుడివి. అంతేకాని నువ్వు పసిపిల్లవాడివి మాత్రం కావు.
ప్రతిపదార్థం: పాలను అంటే క్షీరాన్ని; వెన్నయు అంటే వెన్నను; మ్రుచ్చిలన్ అంటే దొంగిలించగా; రోషముతోడన్ అంటే కోపంతో; నీ తల్లి అంటే నీ తల్లి అయిన యశోద; రోలను అంటే రోటికి; కట్టన్ అంటే తాడుతో బంధించగా; లీలావినోదివి + ఐతివి అంటే ఆటలలోకలిగే సంతోషాన్ని అనుభవించావు; బాలుడవా అంటే నువ్వు సామాన్య పసిబాలుడివా; బ్రహ్మగన్న అంటే బ్రహ్మదేవుని ప్రభవించిన; ప్రభుడవు అంటే గొప్పవాడివి.
దండమయా విశ్వంభర
దండమయా పుండరీకదళ నేత్ర హరీ
దండమయా కరుణానిధి దండమయా నీకునెపుడు దండము కృష్ణా!
దండమయా పుండరీకదళ నేత్ర హరీ
దండమయా కరుణానిధి దండమయా నీకునెపుడు దండము కృష్ణా!
ప్రతిపదార్థం: విశ్వంభర అంటే సమస్త విశ్వాన్ని భరించినవాడా; దండము అంటే నీకు నమస్కారం; పుండరీకదళ అంటే తామరరేకుల వంటి; నేత్ర అంటే కన్నులు కలవాడా; హరీ అంటే ఓ విష్ణుమూర్తీ; దండము అంటే నీకు నమస్కారం; కరుణా అంటే జాలి దయలకు;నిధి అంటే గనియైనవాడా; ఎపుడు అంటే నిరంతరం; దండము అంటే వందనం; కృష్ణా అంటే ఓ శ్రీకృష్ణా; నీకున్ అంటే నీకు, దండము అంటే నమస్కారము.
భావం: సమస్త విశ్వాన్ని భరించినవాడివి. తామరరేకులవంటి కన్నులు గలవాడివి. జాలి దయలకు నిధివంటివాడివి. అటువంటి నీకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను.
భావం: సమస్త విశ్వాన్ని భరించినవాడివి. తామరరేకులవంటి కన్నులు గలవాడివి. జాలి దయలకు నిధివంటివాడివి. అటువంటి నీకు నిరంతరం నమస్కరిస్తూనే ఉంటాను.
శ్రీధర మాధవ యచ్యుత
భూధర పురుహూత వినుత పురుషోత్తమ నీ
పాదయుగళంబు నెప్పుడు
మోదముతో న మ్మినాడ ముద్దుల కృష్ణా!
భూధర పురుహూత వినుత పురుషోత్తమ నీ
పాదయుగళంబు నెప్పుడు
మోదముతో న మ్మినాడ ముద్దుల కృష్ణా!
ప్రతిపదార్థం: శ్రీ అంటే లక్ష్మీదేవిని; ధర అంటే హృదయమునందు ధరించినవాడా; మాధవ అంటే లక్ష్మికి భర్తయైనవాడా; అచ్యుత అంటే చ్యుతి లేనివాడా (శాశ్వతమైనవాడా); పురుహూత అంటే దేవేంద్రుని చేత; వినుత అంటే పొగడబడినవాడా; భూధర అంటేభూదేవిని ధరించినవాడా; పురుషోత్తమ అంటే పురుషులలో శ్రేష్ఠుడైనవాడా; నీ అంటే నీయొక్క; పాదయుగళంబు అంటే రెండు పాదాలను; ఎప్పుడు అంటే నిరంతరం; మోదముతో అంటే ఆనందంతో; నమ్మినవాడ అంటే నమ్ముకున్నాను; ముద్దుల కృష్ణా అంటేముద్దులు మూటగట్టిన శ్రీకృష్ణా!
భావం: లక్ష్మీదేవిని హృదయం మీద నిలిపినవాడా, శ్రీలక్ష్మికి భర్తయైనవాడా, శాశ్వతుడవైనవాడా, దేవేంద్రునిచేత స్తోత్రం చేయబడినవాడా, భూదేవిని ధరించినవాడా, పురుషులయందు పరమశ్రేష్ఠుడవైనవాడా, ముద్దులు మూటగట్టే రూపం కలవాడా, ఓ శ్రీకృష్ణా, నీరెండు పాదాలను నిరంతరం సంతోషంతో నమ్మి ఉన్నాను. అటువంటి నన్ను రక్షించు.
భావం: లక్ష్మీదేవిని హృదయం మీద నిలిపినవాడా, శ్రీలక్ష్మికి భర్తయైనవాడా, శాశ్వతుడవైనవాడా, దేవేంద్రునిచేత స్తోత్రం చేయబడినవాడా, భూదేవిని ధరించినవాడా, పురుషులయందు పరమశ్రేష్ఠుడవైనవాడా, ముద్దులు మూటగట్టే రూపం కలవాడా, ఓ శ్రీకృష్ణా, నీరెండు పాదాలను నిరంతరం సంతోషంతో నమ్మి ఉన్నాను. అటువంటి నన్ను రక్షించు.
నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్నుబ్రోవు నగధర కృష్ణా
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్నుబ్రోవు నగధర కృష్ణా
ప్రతిపదార్థం: నారాయణ అంటే నీరు నెలవుగా ఉన్న; లక్ష్మీపతి అంటే లక్ష్మీదేవికి భర్త అయిన; నారాయణ అంటే అవతారాలు ధరించినప్పుడు మానవ రూపం కలిగిన; వాసుదేవ అంటే వసుదేవుని కుమారుడివైన; నందకుమారా అంటే నందుని కుమారుడివైన;నారాయణ అంటే శబ్దమే గమ్యంగా కలవాడివి; నిను అంటే అటువంటి నిన్ను; నమ్మితి అంటే నమ్మాను; నారాయణ అంటే నరుల సమూహానికి నెలవైనవాడివి; నగధర అంటే కొండను ధరించినవాడివి; కృష్ణా అంటే ఓ కృష్ణా! నన్ను అంటే సామాన్య మానవుడనైననన్ను; బ్రోవు అంటే రక్షించు.
భావం: నీరు నెలవుగా ఉన్న ఓకృష్ణా! లక్ష్మీదేవికి భర్తయైనవాడా! అవతారాలు ధరించిన సమయంలో మానవరూపం ధరించినవాడా, అన్ని లోకాలను నీయందే కలిగినవాడా, నందుని కుమారుడా, శబ్దమే గమ్యంగా కలవాడా, నిన్నే నమ్ముకున్నాను. మానవసమూహానికి స్థానమైన ఓ కృష్ణా! కొండను ధరించిన నీవు నన్ను రక్షించు.
భావం: నీరు నెలవుగా ఉన్న ఓకృష్ణా! లక్ష్మీదేవికి భర్తయైనవాడా! అవతారాలు ధరించిన సమయంలో మానవరూపం ధరించినవాడా, అన్ని లోకాలను నీయందే కలిగినవాడా, నందుని కుమారుడా, శబ్దమే గమ్యంగా కలవాడా, నిన్నే నమ్ముకున్నాను. మానవసమూహానికి స్థానమైన ఓ కృష్ణా! కొండను ధరించిన నీవు నన్ను రక్షించు.
No comments:
Post a Comment