Sunday, November 11, 2018

మన తెలుగు కవయిత్రులు (మూడవ భాగం)

నాయని కృష్ణకుమారి 


గుంటూరు జిల్లాలో 1930, మార్చి 14 న జన్మించారు. ఈమె తల్లిదండ్రులు హనుమాయమ్మ, నాయని సుబ్బారావు. ఈమెకు ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు.ఆమె అక్షరాలా బాల్యం నుంచి కవిత్త్వ తత్త్వం ఆకళించుకున్న కవయిత్రి. సుబ్బారావుగారు ప్రముఖసాహితీవేత్తలతో జరుపుతున్న చర్చలు వింటూ చిన్నతనంలోనే నలుగురిలో నిర్భయంగా మెలగడం, మాట్లాడడం నేర్చారు ఆమె.

వీరు రచించిన కావ్యాలు:

అగ్నిపుత్రి (1978)
ఆయాతా (కథల సంకలనం)
ఏం చెప్పను నేస్తం (కవితాసంకలనం. 1988)
పరిశీలన (వ్యాససంకలనం. 1977)
పరిశోధన (వ్యాససంకలనం. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురణ. 1979)
తెలుగు జానపద వాఙ్మయము. సంఘము, సంస్కృతి, సాహిత్యం. పరిశోధన గ్రంథం. (పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము. 2000)
జానపద సరస్వతి. (జానపద సాహిత్య పరిషత్. 1996)
కాశ్మీర దీపకళిక (యాత్రాచరిత్ర)

వీరికి వచ్చిన సత్కారాలు :

గృహలక్ష్మి స్వర్ణకంకణం
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయిత్రి బహుమతి

ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీ బహుమతి

అబ్బూరి ఛాయాదేవి  


వీరు 13 అక్టోబర్ 1933 న రాజమండ్రి లో  జన్మించారు. వీరి భర్త గారి పేరు అబ్బూరి వరదరాజేశ్వర రావు. వీరు రాసిన "తన మార్గం" కు  2005 లో  సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వీరు ఎన్నో కల్పనా కథలను జర్మన్ నుంచి తెలుగులోకి అనువదించారు మరియు వీరు రాసిన కథలు మన దేశం లోని భాషలతో పాటు ఆంగ్లములోకి కూడా అనువదించబడ్డాయి.

అనగా అనగా (పిల్లల కోసం జానపద కథలు)
అబ్బూరి ఛాయాదేవి కథలు (పిట్ట కథలు),1991
మృత్యుంజయ, 1993
తన మార్గం(మహిళలు కుటుంబ సంబంధాల మధ్య ఎలా నలిగిపోతున్నారో వాటి గురించి)
మన జీవితాలు - జిడ్డు  కృష్ణమూర్తి  వ్యాఖ్యానాలు (అనువాదం)
పరిచిత  లేఖ  - ఆస్ట్రియన్ రచయిత స్టీఫెన్ జవెయిగ్ రాసిన కథలను తెలుగులోకి అనువదించారు
బోన్సాయ్ బతుకులు - (కుటుంబ సభ్యుల నియంత్రణలో యాంత్రికంగా జీవించే మహిళల జీవితాన్ని వర్ణిస్తుంది)

అవార్డులు
రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారం ,2003
తెలుగు యూనివర్సిటీ అవార్డు, 1996
సాహిత్య అకాడెమీ అవార్డు ,2005

No comments:

Post a Comment

జీవన దిక్సూచి

హర హర శంకర శ్రీకర సన్నుతి  మనిషికి  జీవన  దిక్సూచి  హర  హర  లయకార  ఢమరుక  రావాకృతి  మరోమారు  జన్మకు  దిక్సూచి  మట్టిలోనే  మట్టిరా  దేహమన్నది...