కుప్పాంబిక:
కుప్పాంబిక కాకతీయుల కాలం నాటి కవయిత్రి. కుప్పంబిక గారు గోన బుద్దారెడ్డి గారి కుమార్తె, గోన గన్నారెడ్డి గారి సోదరీమణి. తెలుగులో తొలి రామాయణంగా ప్రసిద్ధికెక్కిన రంగనాథ రామాయణం రాసిన గోన బుద్ధారెడ్డికి ఆమె కుమార్తె అని సంగిశెట్టి గతంలోనే ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లాలోని బూదపూర్ (భూత్పూర్)లో క్రీ.శ. 1276లో తన భర్త చనిపోయినప్పుడు వేయించిన శాసనాన్ని బట్టి ఆమె 1230లో జన్మించినట్టు నిర్దారించడం జరిగింది. తండ్రి నుంచి సాహిత్య వారసత్వం పొందారని, భర్త మల్యాల గుండనాథుని ఆస్థానంలోని కవుల స్ఫూర్తితో ఆమె సాహిత్యానికి మెరుగులు దిద్దుకున్నారని ప్రతీతి.
అయ్యలరాజు రామభద్రుడు సంకలనం చేసిన ఓ గ్రంథంలో కుప్పాంబిక పద్యాన్నొకదాన్ని పేర్కొన్నారని ఆయన వివరించారు. బాల్యం నుంచి యవ్వనదశకు చేరుకున్న తనపై మన్మథుడు కురిపించే బాణాలు పెంచే మోహాన్ని తన ప్రియసఖులతో కూడా చెప్పుకోలేకపోవడం గురించి ఆ పద్యంలో కుప్పాంబిక హృద్యంగా రాశారు.
పదహారవ శతాబ్దం నాటి మొల్లకు రెండు వందల ఏండ్ల ముందు కవిత్వం రాసిన కుప్పాంబికే తొలి తెలుగు కవయిత్రిగా సంగిశెట్టి నిర్ధారించారు. అయ్యలరాజు సంకలనంలోని కుప్పాంబిక పద్యం ఇలా ఉంది.
వనజాతాంబకుడేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక యౌవనంబు మదికిన్ ధైర్యంబు రానీయద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలుప నాహా! సిగ్గుమైకోదు పా
వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే !!
తరిగొండ వెంగమాంబ:
తిరుమల వేంకటేశుని గొప్ప భక్తురాలు. తిరుమలలో ఉన్న వెంగమాంబ అన్నదాన సత్రము ఈమె పేరు మీద ఉన్నదే.
వెంకమాంబ చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలములోని తరిగొండ గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కావాల కృష్ణయ్య, మంగమాంబ అను నందవారిక బ్రాహ్మణ దంపతులకు 1730లో జన్మించినది.
వెంకమాంబ బాల్యములో తన తోటి పిళ్లవాళ్లలాగా ఆటలాడుకోక ఏకాంతముగా కూర్చొని భక్తి పారవశ్యముతో మునిగితేలేది. ఆ చిరు ప్రాయములోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురముగా గానము చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యమును సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపినాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంకమాంబకు బోధించాడు. అనతి కాలములోనే వెంకమాంబ ప్రశస్తి నలుమూలల పాకడముతో తండ్రి ఆమె విద్యాభ్యాసమును మాన్పించి తగిన వరునికోసము వెతకడము ప్రారంభించాడు.
తల్లి వెంకమాంబను ఇంటి పనులలో సహాయము చేయమని కోరగా తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ తిరస్కరించింది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందముగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపములతో పెళ్లి చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప ఆమె అందమును చూసి ముగ్ధుడై ప్రేమలో పడి వెంకమాంబను వివాహమాడుటకు అంగీకరించాడు. తండ్రి ఆమెకు మంచిభార్యగా మసలుకోమని హితవు చెప్పి వివాహము జరిపించాడు. వివాహానంతరము వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించ ప్రయత్నము చేసాడు కానీ వెంకమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదు.
ఈమె తిరుమలలో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తున్నది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనుపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉంది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం (ఫసలి 1230) క్రీ.శ. 1890లో తూర్పు ఇండియా కంపెనీవారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తున్నది. ఆమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించారు. చివరకు క్రీ.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు తరిగొండ వెంకమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందారు.
వెంకమాంబ రచనలన్నీ వేదాంతము మరియు భక్తి ప్రధానమైనవే. ఈమె రచనలలో ముఖ్యమైనవి.
వేంకటాచల మహాత్మ్యము నందలి ఒక పద్యము.
శృంగారాకృతి తోడ వచ్చి పదముల్ శృంగార సారంబుతో
డం గూఢంబుగాఁ జెప్ప నీవానిన నేతలం జెప్ప లేనన్న, నన్
ముంగోపంబున జూచి, లేచి యాతనే మ్రొక్కంగ మన్నించి త
చ్చ్రుంగారోక్తులు తానె పల్కొకొను నా శ్రీ కృష్ణు సేవించెదన్.
ఈ పద్యమునందు విద్యావతి యగు వెంగమ్మ హృదయవేదన వెల్లడి యగుచున్నది.
వేంకటాచల మహాత్మ్యమున శృంగార రసమూర్తులగు పద్మావతీ విష్ణుమూర్తులు నాయికా నాయకులు. ప్రస్తవిత విషయము వారి పరిణయము. నాయికా నాయకుల పూర్వాను రాగము, ప్రేమ లీల విలాసములు వర్ణించి, స్థాయి భావము కల్గినగాని, కావ్యము రాణింపదు. అట్టి విషయ ప్రస్తారమున శృంగార రసమే ప్రాధాన్యము వహించును గదా!
కానీ బాల్యవితంతువైనట్టి ఆమె శృంగార రసమును యెట్లు పోషించును ? అందువలన శ్రీ కృష్ణుని నామమునే శృంగార రసముగా మనకు తెలియజేయుచున్నది.
పద్య కావ్యాలు:
వేంకటాచల మహాత్మ్యము
అష్టాంగ యోగసారము
ద్విపద కావ్యాలు
ద్విపద భాగవతము (ద్వాదశ స్కంధము)
రమా పరిణయము
రాజయోగామృత సారము
వాశిష్ఠ రామాయణము
శతకాలు
శ్రీకృష్ణ మంజరి.
తరిగొండ నృసింహ శతకము
యక్షగానాలు
నృసింహ విలాసము
శివలీలా విలాసము
బాలకృష్ణ నాటకము
విష్ణు పారిజాతము
రుక్మిణీ నాటకము
గోపీ నాటకము
చెంచు నాటకము
ముక్తి కాంతా విలాసము
జలక్రీడా విలాసము
తత్వ కీర్తనలు
కుప్పాంబిక కాకతీయుల కాలం నాటి కవయిత్రి. కుప్పంబిక గారు గోన బుద్దారెడ్డి గారి కుమార్తె, గోన గన్నారెడ్డి గారి సోదరీమణి. తెలుగులో తొలి రామాయణంగా ప్రసిద్ధికెక్కిన రంగనాథ రామాయణం రాసిన గోన బుద్ధారెడ్డికి ఆమె కుమార్తె అని సంగిశెట్టి గతంలోనే ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లాలోని బూదపూర్ (భూత్పూర్)లో క్రీ.శ. 1276లో తన భర్త చనిపోయినప్పుడు వేయించిన శాసనాన్ని బట్టి ఆమె 1230లో జన్మించినట్టు నిర్దారించడం జరిగింది. తండ్రి నుంచి సాహిత్య వారసత్వం పొందారని, భర్త మల్యాల గుండనాథుని ఆస్థానంలోని కవుల స్ఫూర్తితో ఆమె సాహిత్యానికి మెరుగులు దిద్దుకున్నారని ప్రతీతి.
అయ్యలరాజు రామభద్రుడు సంకలనం చేసిన ఓ గ్రంథంలో కుప్పాంబిక పద్యాన్నొకదాన్ని పేర్కొన్నారని ఆయన వివరించారు. బాల్యం నుంచి యవ్వనదశకు చేరుకున్న తనపై మన్మథుడు కురిపించే బాణాలు పెంచే మోహాన్ని తన ప్రియసఖులతో కూడా చెప్పుకోలేకపోవడం గురించి ఆ పద్యంలో కుప్పాంబిక హృద్యంగా రాశారు.
పదహారవ శతాబ్దం నాటి మొల్లకు రెండు వందల ఏండ్ల ముందు కవిత్వం రాసిన కుప్పాంబికే తొలి తెలుగు కవయిత్రిగా సంగిశెట్టి నిర్ధారించారు. అయ్యలరాజు సంకలనంలోని కుప్పాంబిక పద్యం ఇలా ఉంది.
వనజాతాంబకుడేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక యౌవనంబు మదికిన్ ధైర్యంబు రానీయద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలుప నాహా! సిగ్గుమైకోదు పా
వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే !!
తరిగొండ వెంగమాంబ:
తిరుమల వేంకటేశుని గొప్ప భక్తురాలు. తిరుమలలో ఉన్న వెంగమాంబ అన్నదాన సత్రము ఈమె పేరు మీద ఉన్నదే.
వెంకమాంబ చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలములోని తరిగొండ గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కావాల కృష్ణయ్య, మంగమాంబ అను నందవారిక బ్రాహ్మణ దంపతులకు 1730లో జన్మించినది.
వెంకమాంబ బాల్యములో తన తోటి పిళ్లవాళ్లలాగా ఆటలాడుకోక ఏకాంతముగా కూర్చొని భక్తి పారవశ్యముతో మునిగితేలేది. ఆ చిరు ప్రాయములోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురముగా గానము చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యమును సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపినాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంకమాంబకు బోధించాడు. అనతి కాలములోనే వెంకమాంబ ప్రశస్తి నలుమూలల పాకడముతో తండ్రి ఆమె విద్యాభ్యాసమును మాన్పించి తగిన వరునికోసము వెతకడము ప్రారంభించాడు.
తల్లి వెంకమాంబను ఇంటి పనులలో సహాయము చేయమని కోరగా తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ తిరస్కరించింది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందముగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపములతో పెళ్లి చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప ఆమె అందమును చూసి ముగ్ధుడై ప్రేమలో పడి వెంకమాంబను వివాహమాడుటకు అంగీకరించాడు. తండ్రి ఆమెకు మంచిభార్యగా మసలుకోమని హితవు చెప్పి వివాహము జరిపించాడు. వివాహానంతరము వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించ ప్రయత్నము చేసాడు కానీ వెంకమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదు.
ఈమె తిరుమలలో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తున్నది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనుపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉంది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం (ఫసలి 1230) క్రీ.శ. 1890లో తూర్పు ఇండియా కంపెనీవారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తున్నది. ఆమె తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించారు. చివరకు క్రీ.శ.1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు తరిగొండ వెంకమాంబ వేంకటేశ్వరస్వామిని స్మరిస్తూ సజీవ సమాధి చెందారు.
వెంకమాంబ రచనలన్నీ వేదాంతము మరియు భక్తి ప్రధానమైనవే. ఈమె రచనలలో ముఖ్యమైనవి.
వేంకటాచల మహాత్మ్యము నందలి ఒక పద్యము.
శృంగారాకృతి తోడ వచ్చి పదముల్ శృంగార సారంబుతో
డం గూఢంబుగాఁ జెప్ప నీవానిన నేతలం జెప్ప లేనన్న, నన్
ముంగోపంబున జూచి, లేచి యాతనే మ్రొక్కంగ మన్నించి త
చ్చ్రుంగారోక్తులు తానె పల్కొకొను నా శ్రీ కృష్ణు సేవించెదన్.
ఈ పద్యమునందు విద్యావతి యగు వెంగమ్మ హృదయవేదన వెల్లడి యగుచున్నది.
వేంకటాచల మహాత్మ్యమున శృంగార రసమూర్తులగు పద్మావతీ విష్ణుమూర్తులు నాయికా నాయకులు. ప్రస్తవిత విషయము వారి పరిణయము. నాయికా నాయకుల పూర్వాను రాగము, ప్రేమ లీల విలాసములు వర్ణించి, స్థాయి భావము కల్గినగాని, కావ్యము రాణింపదు. అట్టి విషయ ప్రస్తారమున శృంగార రసమే ప్రాధాన్యము వహించును గదా!
కానీ బాల్యవితంతువైనట్టి ఆమె శృంగార రసమును యెట్లు పోషించును ? అందువలన శ్రీ కృష్ణుని నామమునే శృంగార రసముగా మనకు తెలియజేయుచున్నది.
పద్య కావ్యాలు:
వేంకటాచల మహాత్మ్యము
అష్టాంగ యోగసారము
ద్విపద కావ్యాలు
ద్విపద భాగవతము (ద్వాదశ స్కంధము)
రమా పరిణయము
రాజయోగామృత సారము
వాశిష్ఠ రామాయణము
శతకాలు
శ్రీకృష్ణ మంజరి.
తరిగొండ నృసింహ శతకము
యక్షగానాలు
నృసింహ విలాసము
శివలీలా విలాసము
బాలకృష్ణ నాటకము
విష్ణు పారిజాతము
రుక్మిణీ నాటకము
గోపీ నాటకము
చెంచు నాటకము
ముక్తి కాంతా విలాసము
జలక్రీడా విలాసము
తత్వ కీర్తనలు
No comments:
Post a Comment